Infosys: నారాయణ మూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు.. కానీ, ఇన్ఫోసిస్ మాత్రం..
- వర్క్-లైఫ్ బ్యాలెన్స్పై దృష్టి పెట్టిన ఇన్ఫోసిస్..
- నారాయణ మూర్తి 70 గంటల పనికి వ్యతిరేకం కీలక నిర్ణయం..
- ఓవర్ టైమ్ చేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట..
- ఆరోగ్యంపై ప్రభావం పడుతుండటంతో చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infosys: ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో చేసిన పని గంటల వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వారానికి 70 గంటలు పనిచేయాలని ఉద్యోగులకు సూచించడం విమర్శల పాలైంది. అయితే, కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ని అందించాలని కోరుకుంటోంది.
ముఖ్యంగా రిమోట్గా పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో, వారి పని గంటల విషయంలో శ్రద్ధ చూపిస్తోంది. ఎక్కువ పనిగంటల వల్ల వచ్చే ఆరోగ్య ప్రమాదాలను గుర్తించింది. ఈ మెసేజుల్లో ఉద్యోగి రిమోట్గా ఎన్ని రోజులు పనిచేవారు, ఎన్ని గంటల పనిచేశాడు, సగటున రోజూ ఎంత టైమ్ సస్పెండ్ చేస్తున్నాడు వంటి వివరాలను పొందుపరుస్తుంది. వర్క్ ఫ్రం హోం పనిచేసేటప్పుడు లాగిన్ అయిన తర్వాత వర్కింగ్ అవర్స్ కన్నా ఎక్కువగా పనిచేస్తుంటే, ఉద్యోగులకు కంపెనీ నుంచి వ్యక్తిగత ఈమెయిల్స్ పంపడం ప్రారంభించింది. సగటున వారంలో 5 రోజులు రోజుకు 9.15 గంటలు పనిచేయాలి, రిమోట్గా పనిచేసేటప్పుడు మరికొన్ని గంటలు అదనంగా కూర్చొంటాం, దీని వల్ల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని ఉద్యోగులు చెబుతున్నారు.
Also Read
Read Also: GST: మధ్యతరగతికి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం.. వీటి ధరలు తగ్గే అవకాశం..
ముఖ్యంగా, ఐటీ ఇండస్ట్రీలో అస్థిరమైన వర్క్ షెడ్యూల్స్ వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. చాలా మంది వర్క్ ఫ్రం హోం చేసే వారు పనిగంటలు పొడగించుకోవడంతో, మెరుగైన వర్క్-లైఫ్ అలవాట్లు దెబ్బతింటున్నాయి. దీంతో ఇన్ఫోసిస్ ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ని పర్యవేక్షిస్తోంది. ఉద్యోగులకు పంపుతున్న ఈమెయిల్స్లో ‘‘ బ్యాలెన్సుడ్ వర్క్-లైఫ్ షెడ్యూల్’’ అవసరమని కంపెనీ చెబుతోంది. పని విభజన, బాధ్యతల గురించి మీ మేనేజర్తో మాట్లాడండి అంటూ మెసేజుల్లో సూచిస్తోంది. ఇన్ఫోసిస్లో ప్రస్తుతం 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!