Annamalai: అన్నామలైపై క్రిమినల్ కేసు.. వివాదంగా పవన్ కళ్యాణ్ హాజరైన సభ..
- అన్నామలైపై క్రిమినల్ కేసు..
- పవన్ కళ్యాన్ హాజరైన సభలో విద్వేష వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: ఇటీవల మధురై కేంద్రంగా మురుగన్ భక్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్వేష ప్రసంగాలు చేశారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కే. అన్నామలైపై, హిందూ మున్నాని గ్రూపులోని ఇద్దరు సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 22న జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వంజినాథన్ అనే న్యాయవాది ఆరోపించారు. ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టేలా అన్నామలై, హిందూ మున్నాని రాష్ట్ర నాయకుడు కాదేశ్వర సుబ్రమణ్యం, మున్నాని కార్యకర్త సెల్వకుమార్ ప్రసంగించారని కేసులు పెట్టారు.
Read Also: Covid Vaccine: కోవిడ్ తర్వాత మరణాలకు వాక్సిన్లు కారణం కాదు.. తాజా అధ్యయనంలో వెల్లడి..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ రాజేంద్రన్ హాజరైన ఈ కార్యక్రమం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ కార్యక్రమంలో పలువురి ప్రసంగాలు, తీర్మానాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మతపరమైన భావాలను దెబ్బతీసేలా మాట్లాడటం, శత్రుత్వాన్ని కలిగించడం మరియు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు BNSS సెక్షన్ 196 (1) (a), 299, 302 , 353 (1) (2) (B) కింద అన్నా నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మద్రాస్ హైకోర్టు నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపించారు.
అయితే, అన్నామలైపై కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది డిసెంబర్లో ముందస్తు అనుమతి లేకుండా చెన్నైలో బ్లాక్ డే ఊరేగింపు నిర్వహించిందుకు అన్నామలైతో పాటు 900 మందికి పైగా బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. కోయంబత్తూర్ పేలుళ్ల దోషి అంత్యక్రియల ఊరేగింపుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై అన్నామలై నిరసన వ్యక్తం చేశారు. దీనిపై డీఎంకే సర్కార్ అన్నామలైపై కేసు నమోదు చేసింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!