Venu Goapl Reddy
Author- NTV Telugu-
Shah Rukh Khan: షారూఖ్ ఖాన్ బంగ్లాలోకి చొరబడిన ఇద్దరు.. మేకప్ రూంలోనే 8 గంటలు.. చూసి షాకైన స్టార్ హీరో..
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇళ్లు ముంబై లోని మన్నత్ బంగ్లాలోకి ఇద్దరు అక్రమంగా చొరబడ్డారు. ఏకంగా 8 గంటల పాటు ఇద్దరు బంగ్లాలోని షారూఖ్ ఖాన్ మేకప్ రూంలో దాక్కుని ఉన్నారు. షారూఖ్ ఫ్యాన్స్ అయిన ఇద్దరు అతడిని కలిసేందుకు ఇదంతా చేశారు. చివరకు వీరిద్దరిని చూసి షాక్ అవ్వడం షారూక్ వంతైంది. ఈ ఘటన గత వారం జరిగింది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చన గౌతమ్కు బెదిరింపులు.. చంపేస్తానన్న ప్రియాంకా గాంధీ పీఏ
Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చనా గౌతమ్ కు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పీఏ తనను చంపేస్తానని బెదిరించారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు అర్చనా గౌతమ్. ఈ విషయమై మీరట్ లోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అర్చనా గౌతమ్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
AAP: ప్రశ్నించిన వారిపై బీజేపీ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోంది..
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఈరోజు నోటీసులు ఇచ్చింది. మార్చి 9న విచారణకు రావాల్సిందిగా ఈడీ కోరింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, మోదీని ప్రశ్నిస్తున్నందుకే సీఎం కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ కవితకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. మరోవైపు మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గపడ్డాయని తెలంగాణ మంత్రులు దుయ్యబడుతున్నారు. -
Minister Jagadish Reddy: మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయ్.. కుట్రలో భాగంగానే కవితకు నోటీసులు
Minister Jagadish Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం మోదీ ప్రభుత్ దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. -
India at UN: కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్.. పనికిమాలిన వ్యాఖ్యలంటూ భారత్ ఘాటు రిఫ్లై
India at UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జమ్మూ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగానే స్పందించింది. మహిళలు, శాంతి మరియు భద్రతపై భద్రతా మండలి చర్చలో పాక్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ మానవహక్కులపై తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలపై భారత్ విరుచుకుపడింది. ఇటువంటి ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు భారత్ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
Tripura: త్రిపుర సీఎంగా మాణిక్ సాహా.. ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని..
Tripura: త్రిపురలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. త్రిపుర ముఖ్యమంత్రిగా నేడు మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. రాష్ట్రంలో బీజేపీని వరసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావడంతో మాణిక్ సాహా కీలకంగా పనిచేశారు. దంతవైద్యుడు, రాజకీయనాయకుడిగా సాహాకు క్లీన్ ఇమేజ్ ఉంది. అగర్తలా వివేకానంద మైదాన్ లో ప్రమాణస్వీకారం జరగనుంది. -
Russia-Ukraine War: బఖ్ముత్ రష్యా సొంతం అయితే అంతే సంగతులు.. జెలన్ స్కీ భయం..
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్ తీవ్రం అవుతోంది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ పట్టణం బఖ్ముత్ లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఈ పట్టణం రష్యా వశం అయితే ఉక్రెయిన్ యుద్ధంపై పట్టుకోల్పోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యా సైన్యం ఎట్టి పరిస్థితుల్లో అయినా బఖ్ముత్ ను స్వాధీనం చేసుకుంటుందని ఆ దేశం పట్టుదలతో ఉంది. -
Bank SMS Fraud: ఫేక్ మేసేజ్ల వల.. 3 రోజుల్లోనే 40 మంది కస్టమర్ల నగదు గోవింద
Bank SMS Fraud:‘‘డియర్ కస్టమర్.. ఈరోజు మీ బ్యాంకు ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడుతోంది.. డియాక్టవేట్ కాకుండా ఉండేందకు ఇప్పుడే మీ కేవీసీ, పాన్ ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేయడానికి కింద లింక్ క్లిక్ చేయండి’’ అంటూ మేసేజ్ వస్తే మీరు దాన్ని ఓపెన్ చేశారంతే అంతే సంగతులు. మోసగాళ్లు మీ ఖాతాలోని నగదును కొట్టేస్తారు. ఇలాంటి మేసేజులు వస్తే క్లిక్ చేయొద్దు. ఇలాంటి మెసేజులను చదివి నిజమే అనుకుని ముంబైలో ఓ బ్యాంకుకు చెందిన 40 మంది కష్టమర్లు తమ డబ్బును పోగొట్టుకున్నారు.… -
Google: ఈ ఏడాది గూగుల్ లో ప్రమోషన్లు తక్కువే.. తాజా నివేదికలో వెల్లడి..
Google: ఐటీ ఇండస్ట్రీలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడుతాయో తెలియడం లేదు. నిన్న మెటా మరో బాంబ్ పేల్చింది. ఇప్పటికే 13,000 మందిని తొలగించిన మెటా మరోసారి వేల సంఖ్యలో ఉద్యోగులను వచ్చే వారం తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది గూగుల్ సంస్థల్లో కొద్ది మందికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయని సీఎన్బీసీ నివేదిక వెల్లడించింది. సీనియర్లుగా ప్రమోషన్లు తగ్గుతాయని గూగుల్ ఇప్పటికే ఉద్యోగులకు తెలిపినట్లు సమాచారం. -
Shraddha Walkar Case: అఫ్తాబ్ శిక్షణ పొందిన చెఫ్.. మాంసాన్ని ఎలా నిల్వ చేయాలో తెలుసు.. ఢిల్లీ పోలీసులు..
Shraddha Walkar Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో పోలీసులు కోర్టులో విస్తూపోయే నిజాలు చెబుతున్నారు. గతేడాది శ్రద్ధావాకర్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా చంపేసి అత్యంత దారుణంగా శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. కొన్ని రోజలు పాటు ఫ్రిజ్ లో నిల్వచేసి ఢిల్లీ శివారు ప్రాంతమైన మోహ్రౌలి సమీపంలోని అడవుల్లో పారేశారు. శ్రద్ధావాకర్ తండ్రి మిస్సింగ్ కేసు పెట్టడంతో ఆరు నెలల తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!