Hunger Deaths: ప్రపంచంలో ప్రతీ నాలుగు సెకన్లకు ఒక ఆకలి చావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Person Dying Of Hunger Every Four Seconds: ప్రపంచంలో ప్రస్తుత పరిణామలు తీవ్ర ఆహార సంక్షోభానికి దారి తీస్తున్నాయి. కోవిడ్ 19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై, ఆహార భద్రతపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చాలా దేశాలు ఆహార ధాన్యాల కొరతతో అల్లాడుతున్నాయి. పలు దేశాలు వారి ప్రజల ఆహార భద్రత కోసం ఎగుమతులను కూడా నిషేధిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచంలో ప్రతీ నాలుగు సెకన్లకు ఒకరు ఆకలితో మరణిస్తున్నారని 200 మందికి పై ఎన్జీవోలు మంగళవారం హెచ్చరించారు. ప్రపంచంలో ఆకలి సంక్షోభాన్ని ముగించాలని ప్రపంచ దేశాలు అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
75 దేశాలకు చెందిన సంస్థలు ఈ సంక్షోభంపై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలను కోరుతూ.. బహిరంగ లేఖ రాశారు. 34.5 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఇది 2019 కన్నా ఎక్కువని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లో 5 కోట్ల మంది ప్రజలు ఆకలితో ఉన్నారని ఎన్జీవోలు తెలిపారు ప్రతీ రోజూ 19,700 మంది ప్రజలు ఆకలితో చనిపోతున్నారని.. అంటే నాలుగు సెకన్లకు ఒకరి చొప్పున ఆకలికి బలవుతున్నారని ఎన్జీవోలు అంచానా వేశారు. సోమాలియా వంటి దేశాలు ఇప్పటికే తీవ్ర ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని తెలిపారు.
Also Read
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
Read Also: Chittoor Fire Accident: ఘోర ప్రమాదం.. ఆ నిర్లక్ష్యం ఖరీదు మూడు ప్రాణాలు
వ్యవసాయం, పంటపద్ధతుల్లో ఆధునిక సాంకేతికతను తెచ్చినా 21వ శాతాబ్ధంలో కరువు గురించి మాట్లాడుతున్నామని.. యెమెన్ ఫ్యామిలీ కేర్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాణాలు రక్షించేందు దీర్ఘకాలిక సహాయంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని ఎన్జీవోలు సూచించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతింది. దీంతో పాటు వాతావరణ మార్పలు కూడా వ్యవసాయ దిగుబడిపై ప్రభావం చూపిస్తోంది. చాలా దేశాల్లో నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల కొరత ఏర్పడింది. ప్రపంచానికి ఎక్కువగా గోధుమల ఉక్రెయిన్, రష్యా నుంచే ఎగుమతి అవుతుంటాయి. అయితే ఇప్పడు ఈ రెండు దేశాలు యుద్ధంలో ఉండటంతో ప్రపంచం మొత్తం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

తాజావార్తలు
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!