Rajasthan Congress: రాజస్థాన్ కాంగ్రెస్లో లుకలుకలు.. సీఎం పదవిని కాపాడుకునే ప్రయత్నంలో గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Congress crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సీఎం అశోక్ గెహ్లాట్ చేపడుతారనే వార్తల నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమాలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తన సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు యువనేత సచిన్ పైలెట్ రాజస్థాన్ కు కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీలో వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో.. అశోక్ గెహ్లాట్ తన పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండేలా ఒప్పించేందుకు అశోక్ గెహ్లాట్ తన వంత ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీనే అధ్యక్షుడు కావాలని తీర్మాణ చేసిన మొదటి రాష్ట్రం కూడా రాజస్థానే. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి కాంగ్రెస్ ఎమ్యెల్యేలు సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ కొనసాగుతారని మంత్రి ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి, పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అశోక్ గెహ్లాట్.
Also Read
- LPG New Rules: ఎల్పీజీ సిలిండర్ న్యూ రూల్స్.. 90 రోజుల గడువు ముగిసింది! ఈ ముఖ్యమైన పనిని ఈరోజే పూర్తి చేయండి
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
- Donald Trump: "తీవ్రమైన దాడి చేస్తాం".. చర్చల వేళ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
- Uddhav Shiv Sena: ఉద్ధవ్పై కోపం లేదు, నిధుల కోసమే తిరుగుబాటు: రెబల్ ఎంపీ..
Read Also: Hijab Row: హిజాబ్ అల్లర్ల వెనక ఆ సంస్థ కుట్ర.. సుప్రీంకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం
అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేసే ఉద్దేశ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఒప్పించేందుకు అశోక్ గెహ్లాట్ కొచ్చిన్ వెళ్లనున్నారు. రాష్ట్రంలో అధికార వ్యతిరేకత లేదని.. ముఖ్యమంత్రి ప్రజలకు దూరం కాలేదని మంత్రి ప్రతాప్ సింగ్ అన్నారు. ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ కేరళలో సాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’ కోసం కేరళ వెళ్లారు. ఇప్పటికే రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 22న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
Jacob Bethell: టీమిండియాకు మరో విదేశీ అల్లుడు? ఇండియన్ బ్యూటీతో లవ్లో పడ్డ ఇంగ్లండ్ సంచలనం!
-
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరపు న్యాయవాది!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్గా బాస్కి చెప్పేస్తుంది!
-
Hanuman 3D: ‘హను-మాన్’ మ్యాజిక్ మళ్లీ మొదలు.. 3D ట్రైలర్ చూసిన ఫ్యాన్స్కు గూస్బంప్స్!
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!