Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రపై కేరళ హైకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petition in Kerala High Court on India Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోసం, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ‘ భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 14వ రోజుకు చేరింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 5 నెలల తర్వాత కాశ్మీర్ లో ముగియనుంది. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే అదే విధంగా వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.
Read Also: Early Diwali to India: ఇండియాకి ఈ ఏడాది ముందే దీపావళి
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
తాజాగా రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ను నియత్రించాటంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. భారత్ జోడో యాత్ర కారణంగా రాష్ట్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ.. కోర్టుకెక్కాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్ర జరుగుతోంది. అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని న్యాయవాది కే. విజయన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే యాత్ర జరిగేలా.. మరోవైపు వాహనాలు వెళ్లే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కే. విజయన్ కోర్టును కోరారు.
భారత్ జోడో యాత్ర కారణంగా ఇటీవల జాతీయరహదారిని నాలుగు గంటల పాటు మూసేశారని.. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. పిటిషన్ లో పేర్కొన్నాడు. అలాగే రాహుల్ గాంధీ యాత్ర కోసం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారని.. దీనికి అయ్యే ఖర్చంతా కాంగ్రెస్ పార్టీనే భరించాలని.. ప్రజల సొమ్ము వినియోగంచకుండా చూడాలని కోరారు. కేరళ ప్రజా రహదారుల చట్టం 2011ను భారత్ జోడో యాత్ర ఉల్లంఘిస్తోందని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ యాత్రపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందింది. యాత్రలో పిల్లల్ని వినియోగిస్తున్నారని.. ఇది వారిపై ప్రభావం చూపిస్తుందని కేంద్ర బాలల హక్కుల సంఘం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!