Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రపై కేరళ హైకోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petition in Kerala High Court on India Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ గత వైభవం కోసం, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ ‘ భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన ఈ యాత్ర 14వ రోజుకు చేరింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 5 నెలల తర్వాత కాశ్మీర్ లో ముగియనుంది. రాహుల్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే అదే విధంగా వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి.
Read Also: Early Diwali to India: ఇండియాకి ఈ ఏడాది ముందే దీపావళి
Also Read
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
తాజాగా రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ను నియత్రించాటంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. భారత్ జోడో యాత్ర కారణంగా రాష్ట్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ.. కోర్టుకెక్కాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్ర జరుగుతోంది. అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని న్యాయవాది కే. విజయన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే యాత్ర జరిగేలా.. మరోవైపు వాహనాలు వెళ్లే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కే. విజయన్ కోర్టును కోరారు.
భారత్ జోడో యాత్ర కారణంగా ఇటీవల జాతీయరహదారిని నాలుగు గంటల పాటు మూసేశారని.. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. పిటిషన్ లో పేర్కొన్నాడు. అలాగే రాహుల్ గాంధీ యాత్ర కోసం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారని.. దీనికి అయ్యే ఖర్చంతా కాంగ్రెస్ పార్టీనే భరించాలని.. ప్రజల సొమ్ము వినియోగంచకుండా చూడాలని కోరారు. కేరళ ప్రజా రహదారుల చట్టం 2011ను భారత్ జోడో యాత్ర ఉల్లంఘిస్తోందని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ యాత్రపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు అందింది. యాత్రలో పిల్లల్ని వినియోగిస్తున్నారని.. ఇది వారిపై ప్రభావం చూపిస్తుందని కేంద్ర బాలల హక్కుల సంఘం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య – గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
-
Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
-
Explainer: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నారా? డాక్టర్ల షాకింగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!