Pakistan: పాకిస్తాన్లో మళ్లీ పెరిగిన పెట్రోల్ రేట్లు.. లీటర్ పెట్రోల్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
pakistan- petrol rates increased again: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. శ్రీలంక ఆర్థిక పరిస్థితికి దగ్గర్లో ఉంది. మరో రెండు నెలల్లో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాకిస్తాన్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ద్రవ్యోల్భనం దెబ్బతిన్న కారణంగా మరోసారి పాక్ ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచింది. బుధవారం లీటర్ పెట్రోల్ పై 1.54 పాకిస్తాన్ రూపాయలను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రేట్లు ఆల్ టైం హైకి చేరాయి. లీటర్ పెట్రోల్ ధర పాకిస్తాన్ రూపాయాల్లో 237.5కు చేరింది. ఇదిలా ఉంటే లీటర్ డిజిల్ ధరను పీకేఆర్ 4.25కి తగ్గించింది. కిరోసిన్ ధరను పీకేఆర్ 8.30కి తగ్గించింది.
Read Also: S. S. Rajamouli :ట్రిపుల్ ఆర్`కు `ఆస్కార`ం ఉంది!
Also Read
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
- Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరో శ్రీలంక అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మన మిత్రులు కూడా పాకిస్తాన్ దేశాన్ని అడుక్కునే దేశంగా భావిస్తున్నారంటూ.. పాక్ పీఎం షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితి చూపాయి. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల సంభవించిన వరదలు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని మరింతగా దెబ్బతీసింది. అంతర్జాతీయ సమాజం తమకు సహాయం చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరుతుంది. ఈ వరదల్లో 1500 మందికి పైగా ప్రజలు మరణించారు. 3.3 కోట్ల మంది వరదలతో ప్రభావితం అయ్యారు. సింధు ప్రావిన్సు, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంక్వాలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా, పాక్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) రోడ్డుకూడా చాలా ప్రాంతాల్లో ధ్వంసం అయింది.
పూర్తిగా వరదల ప్రభావం తగ్గడానికి రెండు నుంచి ఆరు నెలలు పడుతుందని.. ప్రభుత్వం వెల్లడించింది. వరద ప్రభావిత మలేరియా, డెంగ్యూ, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ కు చిరకాల మిత్రుడిగా ఉన్న చైనా కూడా పాకిస్తాన్ దేశాన్ని ఆదుకునేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. సీపెక్ కింద అభివృద్ధి ప్రాజెక్టుకు పెట్టిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని చైనా, పాకిస్తాన్ ను కోరుతోంది. గతంలో పాకిస్తాన్ ను అదుకున్న యూఏఈ, సౌదీ వంటి అరబ్ దేశాలు కూడా పాకిస్తాన్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు.
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!