Congress President Election: సోనియాతో సమావేశం కానున్న అశోక్ గెహ్లాట్.. జోడు పదవులు నిర్వహించే ఆలోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించడంతో ఈ సారి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు వచ్చే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి వీర విధేయుడని అశోక్ గెహ్లాట్ కు పేరుంది. అయితే అశోక్ గెహ్లాట్ మాత్రం ఇటు సీఎంగా, అటు పార్టీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Delhi Accident: నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురి దుర్మరణం
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో చర్చించేందుకు బుధవారం రోజు అశోక్ గెహ్లాట్, సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఆ తరువాత కేరళలో జరుగుతన్న రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’కు వెళ్లనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టేందుకు చివరిసారిగా ఒప్పించేందుకు ఈ రోజు అశోక్ గెహ్లాట్ కొచ్చిన్ వెళ్లనున్నారు. అయితే అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడు అయితే సచిన్ పైలెట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా.. గెహ్లాట్ మాత్రం సీఎం పదవిని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. సచిన్ పైలెట్ ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే తాను సీఎంగా కొనసాగుతానని.. సీఎం అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలతో చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ వేసే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రావాలని ఆయన కోరారు. ఒక వేళ అధ్యక్షుడిని అయినా..సీఎంగా కొనసాగాలనే పట్టుదలలో గెహ్లాట్ ఉన్నారు. సచిన్ పైలెట్ ఆశలకు గండి కొట్టాలని చూస్తున్నారు.
2017లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్ గాంధీ.. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం తరువాత పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అధినేత్రిగా సోనియాగాంధీనే ఉంటున్నారు. సెప్టెంబర్ 22న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!