Congress President Election: సోనియాతో సమావేశం కానున్న అశోక్ గెహ్లాట్.. జోడు పదవులు నిర్వహించే ఆలోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించడంతో ఈ సారి గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు వచ్చే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి వీర విధేయుడని అశోక్ గెహ్లాట్ కు పేరుంది. అయితే అశోక్ గెహ్లాట్ మాత్రం ఇటు సీఎంగా, అటు పార్టీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Delhi Accident: నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురి దుర్మరణం
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో చర్చించేందుకు బుధవారం రోజు అశోక్ గెహ్లాట్, సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఆ తరువాత కేరళలో జరుగుతన్న రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’కు వెళ్లనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టేందుకు చివరిసారిగా ఒప్పించేందుకు ఈ రోజు అశోక్ గెహ్లాట్ కొచ్చిన్ వెళ్లనున్నారు. అయితే అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడు అయితే సచిన్ పైలెట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా.. గెహ్లాట్ మాత్రం సీఎం పదవిని వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. సచిన్ పైలెట్ ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే తాను సీఎంగా కొనసాగుతానని.. సీఎం అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలతో చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ వేసే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రావాలని ఆయన కోరారు. ఒక వేళ అధ్యక్షుడిని అయినా..సీఎంగా కొనసాగాలనే పట్టుదలలో గెహ్లాట్ ఉన్నారు. సచిన్ పైలెట్ ఆశలకు గండి కొట్టాలని చూస్తున్నారు.
2017లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్ గాంధీ.. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం తరువాత పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అధినేత్రిగా సోనియాగాంధీనే ఉంటున్నారు. సెప్టెంబర్ 22న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!