Students Self Distraction: మూడు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఎల్పీయూలో విద్యార్థుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Self Distraction-Huge protest at Lovely Professional University:ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అలహాబాద్ యూనివర్సిటీలో తారాచంద్ హస్టల్ లో ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫీజు పెంపు నిర్ణయం వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య విషయం యూనిర్సిటీ మొత్తం వ్యాపించడంతో విద్యార్థులంతా నిరసన, ఆందోళనలు చేపట్టారు. విద్యార్థులు ఫీజు పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మరణించిన విద్యార్థి జయ కపూర్ యూనివర్సిటీకి చెందిన వాడు కాదని.. హాస్టల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నారని.. ఫీజు పెంపుతో ఈ ఆత్మహత్యకు సంబంధం లేదని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
Read Also: Hunger Deaths: ప్రపంచంలో ప్రతీ నాలుగు సెకన్లకు ఒక ఆకలి చావు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తమిళనాడులో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది. తూతుకూడి జిల్లా ససువందనైలోని స్కూల్ లోని వాష్రూమ్లో ఉరి వేసుకుని కనిపించింది. తమిళనాడు రామనాథపురానికి చెందిన 17 ఏళ్ల వైథీశ్వర అనే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవిల్ పట్టి ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాల వల్లే బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వెల్లడించారు.
పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది. జలంధర్ లోని ఎల్పీయూలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సూసైడ్ నోట్ లో వెల్లడించారు. ఈ ఆత్మహత్య యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. భారీగా విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే విద్యార్థులు మాత్రం పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగారు. వ్యక్తిగత కారణాల వల్లే విద్యార్థి చనిపోయాడని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. చంఢీగడ్ యూనివర్సిటీలో విద్యార్థినుల ఎంఎంఎస్ లకు సంబంధించిన ఆందోళనలు జరుగుతున్న రోజు వ్యవధిలోనే ఎల్పీయూలో విద్యార్థి ఆత్మహత్యపై ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!