Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక ఆ కేసులన్నీ ప్రత్యక్ష ప్రసారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live streaming Of Supreme Court Constitution Bench Hearings: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారించే అన్ని కేసుల విచారణను తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇటీవల సీజేఐగా పదవీ విరమణ చేసిన ఎన్వీ రమణ, పదవీ విరమణ రోజు సుప్రీంకోర్టు తన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దీంతో ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఇకపై రాజ్యాంగ ధర్మాసనం విచారించే ప్రముఖ కేసులన్నింటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం..కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లో తీర్పును ఇచ్చింది. ఇది ప్రస్తుతం అమలులోకి వచ్చే ప్రక్రియ ప్రారంభం అయింది.
Read Also: Nizamabad BJP: ఎన్నికల్లో సీటు ఆశించే నేతలకు బీజేపీ దిమ్మదిరిగే పరీక్ష పెడుతుందా?
Also Read
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
- Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
భారత ప్రధాన న్యాయమూర్తిగా యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఒకటి. దేశంలో ప్రముఖ కేసులైన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దు వంటి కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. ఆగస్టు 26న అప్పటి సీజేఐ ఎన్వీ రమణ, పదవీ విరమణ రోజున కోర్టు విచారణలు లైవ్ స్ట్రీమింగ్ జరిగాయి. కొన్ని కేసులు ఏళ్ల తరబడి పెడింగ్ లో ఉండటంతో ఎన్వీ రమణ.. పలు కేసులపై రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేశారు.
గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో కోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనిచేశాయి. వర్చువల్ గా కేసుల విచారణ జరిగింది. కోర్టుల విచారణలో సాంకేతికతను విరివిగా ఉపయోగించారు. ఇది కూడా కోర్టు కేసులను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. గతంలో కూడా పలువురు ప్రజా, రాజ్యాంగ ప్రాముఖ్యత ఉన్న కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని న్యాయమూర్తులకు లేఖలు రాశారు. సమాచార స్వేచ్ఛ కూడా ప్రతీ పౌరుడి ప్రాథమిక హక్కుల్లో ఒకభాగంగా ఉందని.. ఇటువంటి కేసుల్లో విచారణను ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇకపై రాజ్యాంగ ధర్మాసనం కేసుల్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!