Venu Goapl Reddy
Author- NTV Telugu-
COVID-19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
COVID-19: దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు 1000కి లోపే ఉన్న కేసుల సంఖ్య ప్రస్తుతం వెయ్యిని దాటి నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 1,134 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,026కు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో చత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మరణించారు. -
PM Modi: మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు.. 44 కేసులు నమోదు చేసిన పోలీసులు..
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీ వ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తున్నారు కొందరు. అయితే ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో వేల సంఖ్యలో మోదీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లు వెలిశాయి. ‘‘ మోదీ హటావో-దేశ్ బచావో’’ అంటూ పోస్టర్లపై రాతలు ఉన్నాయి. వీటిపై పోలీసులు 44 కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది. -
Afghanistan Earthquake: ఆఫ్ఘన్, పాక్లలో 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు..
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో మంగళవారం 6.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ తోపాటు పాకిస్తాన్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఉత్తరభారతదేశంలో కూడా రెండు నిమిషాల పాటు ప్రకంపలు వచ్చాయి. ఆఫ్ఘన్, పాక్ లలో భూకంపం వల్ల 11 మంది చనిపోయారు. పాకిస్తాన్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ స్వాత్ లోయలో గాయాల వల్ల ప్రజలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. పాకిస్తాన్ లో 9 మంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా… -
Amritpal Singh Case: ఐదో రోజు అమృత్పాల్ సింగ్ కోసం వేట.. ఇండో-నేపాల్ బోర్డర్లో హై అలర్ట్..
Amritpal Singh Case: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం ఐదో రోజు వేట కొనసాగుతోంది. పంజాబ్ తో పాటు చుట్టుపక్కట రాష్టాల్లో కూడా ఆయన కోసం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండో-నేపాల్ బోర్డర్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఈ మార్గం గుండా నేపాల్ కు పారిపోయే అవకాశం ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో శివలింగం కార్బన్ డేటింగ్పై స్పష్టత ఇవ్వాలని కోర్టు ఆదేశం
Gyanvapi Case: వారణాసి జ్ఞానవాపి మసీదు కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. మసీదులోని వాజుఖానాలో దొరికిన ‘‘శివలింగం’’గా చెప్పబడుతున్న ఆకారానికి కార్బన్ డేటింగ్ పై ఏప్రిల్ 15 లోగా స్పష్టత ఇవ్వాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. కార్బన్ డేటింగ్ ప్రక్రియ వల్ల శివలింగం దెబ్బతింటుదా..? అనేదానిపై ఏఎస్ఐ తన ప్రతిస్పందన తెలియజేయడానికి చివరి అవకాశం ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. కార్బన్ డేటింగ్ వల్ల మసీదు, అందులోని శివలింగం ఏ కాలానికి చెందినవనే వివరాలను… -
Ukraine: ఉక్రెయిన్ లో జపాన్ ప్రధాని కిషిడా ఆకస్మిక పర్యటన
Japan PM Kishida Visits Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఉక్రెయిన్ లో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రధాని కిషిడా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పర్యటించారు. ఈ నెలలో 19 నుంచి 21 వరకు ఆయన భారత్ లో పర్యటించారు. ఇదే దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఆ తరువాత ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ప్రభుత్వ విమానంలో కాకుండా చార్టెడ్ విమానంలో పోలాండ్ చేరుకున్నారు. ఆదివారం రాత్రి జపాన్ రాజధాని… -
Pakistan: పాకిస్తాన్ టాప్ ఇంటెలిజెన్స్ అధికారి హతం..
Pakistan: పాకిస్తాన్ లో టాప్ ఇంటెలిజెన్స్ అధికారిని చంపారు ఉగ్రవాదులు. వాయువ్య పాకిస్తాన్ లో మంగళవారం ఉగ్రవాదులు, అధికారులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ అధికారి హతమవ్వగా.. ఆయన బృందంలోని ఏడుగురికి గాయాలు అయ్యాయని పాక్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది నుంచి పాక్ పరిస్థితులు దిగజారడంతో వాయువ్య ప్రాంతం అయిన ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఈ ప్రాంతాన్ని పాక్ నుంచి విముక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
Chennai: అవినీతి రాణి.. మహిళా ఇన్స్పెక్టర్ కహానీ..
Chennai: అవినీతిని నిర్మూలించాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి కొంతమంది వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డపేరు వస్తోంది. ఇదిలా ఉంటే తమిళనాడులో ఓ మహిళా ఇన్స్పెక్టర్ భారీ అవినీతికి తెరలేపింది. అయితే ఆమె అవినీతిపై మొత్తం పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. వారి మొప్పు పొందుతూనే.. మరోవైపు లంచాల రూపంలో భారీగా ఆస్తులు కూడబెట్టింది. చివరకు విచారణలో దొరికి ఉద్యోగం పోగొట్టుకుంది. -
Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం.. దొరికిన దొంగలు..
Aishwarya Rajinikanth: స్టార్ హీరో ధనుష్ భార్య, సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రాజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలో పోయెస్ గార్డెన్ లో ఉన్న ఆమె ఇంటి నుంచి 100 సవర్ల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రాభరణాలు, 4 కిలోల వెండి, ఆస్తి పత్రాలు దొంగతనానికి గురయ్యాయి. ఇది ఇంటి దొంగల పనిగా పోలీసులు తేల్చారు. ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి ఈశ్వరి, డ్రైవర్ వెంకటేశన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని తేనాంపేట ఇ-3 పోలీసులు… -
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. వణికిన ఉత్తర భారతం..
Earthquake: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీని ధాటికి ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాదాపుగా రెండు నిమిషాల పాటు బలమైన ప్రకంపలను వచ్చాయి.
తాజావార్తలు
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!