Kerala: పీఎఫ్ఐ నుంచి ప్రమాదం..ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరి భద్రత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Y-category security for RSS leaders: రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్పైఐ) దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాడులు జరిగాయి. ఎన్ఐఏ, ఈడీలు సంయుక్తంగా దాడులు చేసి పీఎఫ్ఐ కీలక నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వారివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచడంతో పాటు ముస్లిం యువతను లష్కరే తోయిబా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తోందనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్, టర్కీ నుంచి నిధులను అక్రమంగా సేకరిస్తోందని విచారణలో తేలింది. దీంతో కేంద్రం పీఎఫ్ఐపై 5 ఏళ్లు నిషేధాన్ని విధించింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అరెస్ట్ అయిన పీఎఫ్ఐ కార్యకర్తల నుంచి కీలక విషయాలను రాబట్టేపనిలో ఉంది ఎన్ఐఏ. ఇదిలా ఉంటే పీఎఫ్ఐ సంస్థపై పాన్ ఇండియా దాడుల తర్వాత తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబుదాడులు జరిగాయి. ఇక పీఎఫ్ఐకి మూలాలు బలంగా ఉన్న కేరళలో పీఎఫ్ఐ హర్తాళ్ కు పిలుపునిచ్చింది. పీఎఫ్ఐ కార్యకర్తలు కేరళలో హింసాత్మక దాడులకు పాల్పడ్డారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Womens Asia Cup: రప్ఫాడించిన రోడ్రిగ్స్.. లంకపై భారత్ ఘనవిజయం
ఇదిలా ఉంటే కేరళకు చెందిన ఐదుగురు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) నేతలకు కేంద్రం భద్రతను పెంచింది. పీఎఫ్ఐ గతం నుంచి వీరిపై నిఘా ఉంచడంతో ఏ సమయమైన దాడులు చేసే అవకాశం ఉందని కేరళకు చెందిన ఐదుగురు ఆర్ఎస్ఎస్ నేతలకు కేంద్రం ‘వై కేటగిరి’ భద్రతను కల్పిస్తున్నట్లు శనివారం వెల్లడించింది. ఇటీవల జరిగిన దాడుల్లో సెంట్రల్ ఏజెన్సీలు ఈ ఐదుగురు ఆర్ఎస్ఎస్ నేతలను పీఎఫ్ఐ టార్గెట్ చేస్తున్నట్లు గుర్తించింది. దీంతో సీఆర్పీఎఫ్ దళాలతో వీరికి వై కేటగిరి సెక్యూరిటీని కల్పించనున్నారు.
కేరళలో ఐదు రాష్ట్ర స్వయమ్సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాయకులకు ఈ కేంద్రం వై వర్గం భద్రతా కవర్ను అందించినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి. ఈ వారం ప్రారంభంలో ఇస్లామిక్ సంస్థపై ఇటీవల అణిచివేసిన సందర్భంగా సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీలు ఈ కనెక్షన్లో పత్రాలను తిరిగి పొందిన తరువాత RSS నాయకుల పేర్లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) యొక్క రాడార్లో కనుగొనబడ్డాయి.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!