Putin Comments On India: భారతదేశాన్ని దోచుకున్నప్పుడు గుర్తుకు రాలేదా..? పశ్చిమ దేశాలపై పుతిన్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin Comments On India: ఉక్రెయిన్ లోని జోపోరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ నాలుగు ప్రాంతాలను అధికారికంగా రష్యా తనలో కలుపుకుంది. అయితే దీనిపై యూఎస్ఏతో పాటు యూరోపియన్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. రష్యా బెదిరింపుకు భయపడేది లేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు రష్యాపై మరింతగా ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యాయి. జి 7 దూశాలు కూడా రష్యా, ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమదేశాల ద్వంద్వనీతి తూర్పారపట్టారు. పాశ్చాత్య దేశాలు మధ్యయుగ కాలంలో అనేక దేశాలను లూటీ చేశాయని.. అక్కడి ప్రజలను బానిసలుగా చూశాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని ఎన్నో విధాలుగా దోచుకున్నారని..ప్రజలను బానిసలుగా చేసి వ్యాపారం చేశాయని, అమెరికాలో భారత తెగల మారణహోమం జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని దోచుకున్నప్పుడు పాశ్చాత్య దేశాలకు ఇవన్నీ గుర్తుకు రాలేదా..? అంటూ అమెరికా, యూరోపియన్ దేశాలను ప్రశ్నించారు. భారత్ తో పాటు ఆఫ్రికా దేశాల్లోని అనేక ప్రాంతాల్లో దోపిడి జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలు చైనాకు వ్యతిరేకంగా యుద్ధాలు చేశాయని పుతిన్ గుర్తు చేశారు.
Also Read
- Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
Read Also: UNSC Resolution: రష్యాపై మండిపడిన ఐరాస.. ఓటింగ్కు భారత్ దూరం
ఇదిలా ఉంటే నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇకపై అక్కడి ప్రజలు తమ వారే అని.. వారంతా రష్యన్లే అని పుతిన్ స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత జోపోరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు రష్యాలో విలీనం కావడానికే మొగ్గు చూపారు. దీంతో ఉక్రెయిన్ లోని 15 శాతం భూభాగం ఇకపై రష్యాలో చేరినట్లు అయింది. అంతకుముందు 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించుకుంది.
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ ప్రతిపాదనను వేగవంతం చేయాలని కోెరాడు. పుతిన్ ఉన్నంత వరకు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ మాట్లాడుతూ.. అక్రమంగా ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడం యూఎన్ చార్టర్ కు వ్యతిరేకం అని అన్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!