Congress President Elections: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఇద్దరే.. కేఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress President Elections: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. అనేక మలుపులు తిరుగుతున్న ఈ ఎన్నికలు ప్రస్తుతం ఓ కొలిక్కివచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షఎన్నికల కోసం మల్లికార్జున ఖర్గేతో పాటు శశిథరూర్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్లు దాఖలు చేశారు. తాజాగా త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో పోటీలో ఇద్దరే మిగిలారు. వీరిద్దరి మధ్యే పోటీ నెలకొననుంది.
త్రిపాఠి సమర్పించిన నామినేషన్ లో సరైన ప్రతిపాదించే వారి సంతకాలు సరిగ్గా లేకపోవడంతో ఆయన నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ఏఐసీసీ సెంట్రల ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ శనివారం వెల్లడించారు. నామినేషన్ ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు సమయంల ఉంది. ప్రస్తుతం ఖర్గేతో పాటు శశిథరూర్ మాత్రమే పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరైనా నామినేషన్ ఉపసంహరించుకుంటే.. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నిక అవుతారు. లేకపోతే అక్టోబర్ 17న ఎన్నికలు జరగుతాయి. అక్టోబర్ 19మంది ఫలితాలను వెల్లడిస్తారు. దాదాపుగా 25 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి గాంధీయేతర వ్యక్తులకు దక్కబోతోంది.
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Read Also: Chintakayala Vijay: చింతకాయల విజయ్ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉంటారని అంతా అనుకున్నప్పటికీ.. అనేక రాజకీయ పరిణామాల మధ్య ఆయన పోటీ నుంచి విరమించుకున్నారు. సచిన్ పైలెట్ కు రాజస్థాన్ సీఎం పదవిని అప్పగించేందుకు గెహ్లాట్ సుముఖంగా లేకపోవడంతో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం తలెత్తింది. ఏకంగా 92 మంది ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. గెహ్లాట్ కు మద్దతుగా రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో అధిష్టానం కూడా ఏం చేయలేకపోయింది.
అనూహ్యంగా మల్లికార్జున ఖర్గే పేరు చివరి నిమిషంలో తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దళిత కార్డు ఉపయోగించుకుని.. సానుభూతి సంపాదించుకునేందుకు ఖర్గేను అధ్యక్షఎన్నికల బరిలో నిలబెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఖర్గే దక్షిణ భారతానికి చెందని వ్యక్తి కావడం, రానున్న రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఖర్గేను అనూహ్యంగా ఎన్నికల బరిలో నిలబెట్టారు. దీనికి తగ్గట్లుగానే ఖర్గేకు ఇప్పటికే 30 మందికి పైగా కాంగ్రెస్ నేతలు మద్దతు ప్రకటించారు.
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: త్రిష పేరుతో సభలో వివాదం.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!
-
Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
Ravi Teja : సెంటిమెంట్స్ను పట్టించుకోని రవితేజ.. చైల్డ్ సెంటిమెంట్ హిట్ తీసుకొస్తుందా?
-
Rohit Sharma: నువ్వు నిజమైన లెజెండ్.. తెర వెనుక ఎంతగానో కష్టపడ్డావ్.. రోహిత్ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!