5G In India: 5జీ సేవలు మన మొబైల్స్ను చేరేదెప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5G services in India: దేశంలో 5జీ సేవలను అక్టోబర్ 1 నుంచి ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి 5జీ నాంది పలుతుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం 13 నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే మొదటగా ఎయిర్ టెల్ వినియోగదారులు మాత్రమే 5జీ సేవలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, చండీగఢ్. గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్ నగర్ ఉన్నాయి. ఈ నగరాల్లో ప్రస్తుతం సెలెక్టెడ్ ఏరియాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా టెలికాం ఆపరేటర్లు ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5జీని ప్రారంభించనున్నారు. డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది రిలయెన్స్ జియో. ఈ నెలలో కొన్ని నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి జియో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నగరాల్లో జియో తన 5జీ సేవలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు గూగుల్ భాగస్వామ్యంతో తక్కువ ధరలకు 5జీ మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి జియో ప్రయత్నిస్తోంది.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Kerala: పీఎఫ్ఐ నుంచి ప్రమాదం..ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరి భద్రత.
భారతీ ఎయిర్ టెల్ శనివారం నాలుగు మెట్రో నగరాలతో పాటు ఎనిమిది నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. చెన్నై, హైదరాబాద్, సిలిగురి నగరాల్లో కూడా 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఏయిర్ టెల్ ప్రకటించింది. 2024 నాటికి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు అందించేందుకు ఎయిర్ టెల్ ప్రయత్నిస్తోంది.
మరో టెలికాం దిగ్గజం వోడాఫోన్-ఐడియా మాత్రం 5జీ సేవలను ఎప్పుడు తీసుకువస్తామనే కాలపరిమితిని చెప్పకున్నా.. గ్రామీణ భారతదేశంలో 5జీ సేవలను అందిస్తామని తెలిపింది. ఇండియాలో 5జీ మొబైల్స్ అందించేందుకు వోడాఫోన్, వన్ ప్లస్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే కేంద్రం మాత్రం తక్కువ వ్యవధిలోనే దేశంలోని 80 శాతం ప్రజలకు 5జీ చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
-
CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
-
Salman Khan: గెలాక్సీ అపార్ట్మెంట్స్కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
-
Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
-
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!