5G In India: 5జీ సేవలు మన మొబైల్స్ను చేరేదెప్పుడంటే..?
5G services in India: దేశంలో 5జీ సేవలను అక్టోబర్ 1 నుంచి ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి 5జీ నాంది పలుతుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం 13 నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే మొదటగా ఎయిర్ టెల్ వినియోగదారులు మాత్రమే 5జీ సేవలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, చండీగఢ్. గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్ నగర్ ఉన్నాయి. ఈ నగరాల్లో ప్రస్తుతం సెలెక్టెడ్ ఏరియాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా టెలికాం ఆపరేటర్లు ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5జీని ప్రారంభించనున్నారు. డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది రిలయెన్స్ జియో. ఈ నెలలో కొన్ని నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి జియో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా నగరాల్లో జియో తన 5జీ సేవలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు గూగుల్ భాగస్వామ్యంతో తక్కువ ధరలకు 5జీ మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి జియో ప్రయత్నిస్తోంది.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Kerala: పీఎఫ్ఐ నుంచి ప్రమాదం..ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరి భద్రత.
భారతీ ఎయిర్ టెల్ శనివారం నాలుగు మెట్రో నగరాలతో పాటు ఎనిమిది నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. చెన్నై, హైదరాబాద్, సిలిగురి నగరాల్లో కూడా 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఏయిర్ టెల్ ప్రకటించింది. 2024 నాటికి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు అందించేందుకు ఎయిర్ టెల్ ప్రయత్నిస్తోంది.
మరో టెలికాం దిగ్గజం వోడాఫోన్-ఐడియా మాత్రం 5జీ సేవలను ఎప్పుడు తీసుకువస్తామనే కాలపరిమితిని చెప్పకున్నా.. గ్రామీణ భారతదేశంలో 5జీ సేవలను అందిస్తామని తెలిపింది. ఇండియాలో 5జీ మొబైల్స్ అందించేందుకు వోడాఫోన్, వన్ ప్లస్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే కేంద్రం మాత్రం తక్కువ వ్యవధిలోనే దేశంలోని 80 శాతం ప్రజలకు 5జీ చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!