Asaduddin Owaisi assault case: అసదుద్దీన్ ఓవైసీ హత్యా నిందితులకు బెయిల్.. యూపీ ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi assault case: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ పర్యటిస్తున్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై ఇద్దరు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు తాజగా బెయిల్ లభించింది. అయితే వారికి బెయిల్ లభించడాన్ని సవాల్ చేస్తూ అసదుద్దీన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర స్పందన కోరింది. న్యాయమూర్తులు ఎంఆర్ షా, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఇద్దరు నిందితులు సచిన్ శర్మ, శుభమ్ గుర్జార్లకు నోటీసులు జారీ చేసింది. మూడో నిందితుడు అలీమ్ కు మంజూరైన బెయిల్ ను సవాల్ చేయడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Read Also: Russia-Ukraine War: ఉక్రెయిన్ భూభాగాలు రష్యాలో విలీనం.. అధికారికంగా ప్రకటించిన పుతిన్
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
ఈ కేసును సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది. ఫిబ్రవరి 3న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఓ రాజకీయ కార్యక్రమానికి హాజరై, ఢిల్లీ వస్తున్న క్రమంలో అసదుద్దీన్ ఓవైసీపై దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన తప్పించుకున్నారు. హాపూర్ లో ఓ టోల్ గేట్ సమీపంలోకి అసదుద్దీన్ కారు రాగానే నిందితులు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్షపాతం, ద్వేషానికి సంబంధించిన నేరానికి ఇది ఉదాహరణ అని.. ఇది హత్యాయత్నానికి దారి తీసిందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో అసదుద్దీన్ పేర్కొన్నారు. నిందితుడు సచిన్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పిటీషనర్ ను బెదిరించాడని పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఈ కేసులో నిందితులు తమ ప్రమేయం లేదని చెప్పలేదని.. పైగా నేరం పట్ల గర్వంగా భావిస్తున్నారంటూ అసదుద్దీన్ తరుపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో సీసీ కెమెరాల ఆధారాలు కీలకంగా మారాయి. నిందితులు ఇద్దరి నుంచి రెండు పిస్టల్స్, ఓ ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులిద్దరిపై 307 సెక్షన్ హత్యా నేరం కింది పిలుఖువా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
తాజావార్తలు
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!