Russia-Ukraine War: ఉక్రెయిన్ భూభాగాలు రష్యాలో విలీనం.. అధికారికంగా ప్రకటించిన పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు ప్రాంతాలైన ఖేర్సన్, జపోరిజ్జియా, డోనెట్స్క్, లూహాన్స్క్ ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రకటించారు. రష్యాలో నాలుగు కొత్త ప్రాంతాలు చేరాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ తో ఏడు నెలల యుద్ధంలో ఆ దేశానికి చెందిన తూర్పు భాగాలను రష్యా పాక్షికంగా ఆక్రమించుకుంది. తాజాగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణతో ఉక్రెయిన్ లోని ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో అధికారికంగా విలీనం అయ్యాయి.
Read Also: New Delhi: మలేషియన్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
శుక్రవారం రష్యాలో విలీనం అయిన నాలుగు ప్రాంతాలకు చెందిన నేతలు పుతిన్ తో సమావేశం అయ్యారు. వెస్ట్రన్ దేశాలు రష్యాను వలస రాజ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కొత్తగా విలీనం అయిన ప్రాంతాల్లో అణ్వాయుధ వినియోగం గురించి పుతిన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాలను రెండుసార్లు ఉపయోగించిన ఏకైక దేశం అమెరికా అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మేము మా భూభాగాన్ని రక్షించుకుంటామని.. ఇది రష్యా ప్రజల విముక్తి పోరాటం అని ఆయన అన్నారు. ఈ నాలుగు ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పటికీ రష్యా పౌరులే అని పుతిన్ అన్నారు. లూహాన్స్క్, డోనెట్క్స్, జపోరిజ్జియా, ఖేర్సర్ ప్రాంతాల్లోని ప్రజలు రష్యాలో చేరేందుకు సిద్ధ పడ్డారని వీరంతా ఇకపై మా ప్రజలే అని పుతిన్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం అయిన యుద్ధం ఏడు నెలలుగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా విలీనం తరువాత తొలిసారిగా ఉక్రెయిన్ చర్చలకు రావాలని పుతిన్ కోరారు. ఇదిలా ఉంటే రష్యా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సరైంది కాదని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ నాలుగు ప్రాంతాలు రష్యా నియంతృత్వానికి లొంగవని ఉక్రెయిన్ హెచ్చరించింది. 2014 నుంచి ఈ నాలుగు ప్రాంతాల్లో రష్యా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాయి. ప్రస్తుతం ఈ నాలుగు ప్రాంతాలు అధికారికంగా విలీనం చేసుకున్న తరువాత ఈ భూభాగాల్లోకి నాటో దళాలు అడుగుపెట్టలేవు.
తాజావార్తలు
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి