Russia-Ukraine War: ఉక్రెయిన్ భూభాగాలు రష్యాలో విలీనం.. అధికారికంగా ప్రకటించిన పుతిన్
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ లోని తూర్పు ప్రాంతాలైన ఖేర్సన్, జపోరిజ్జియా, డోనెట్స్క్, లూహాన్స్క్ ప్రాంతాలను అధికారికంగా విలీనం చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రకటించారు. రష్యాలో నాలుగు కొత్త ప్రాంతాలు చేరాయని ఆయన అన్నారు. ఉక్రెయిన్ తో ఏడు నెలల యుద్ధంలో ఆ దేశానికి చెందిన తూర్పు భాగాలను రష్యా పాక్షికంగా ఆక్రమించుకుంది. తాజాగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణతో ఉక్రెయిన్ లోని ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో అధికారికంగా విలీనం అయ్యాయి.
Read Also: New Delhi: మలేషియన్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు
Also Read
- Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్
- North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
- Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
- Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..
శుక్రవారం రష్యాలో విలీనం అయిన నాలుగు ప్రాంతాలకు చెందిన నేతలు పుతిన్ తో సమావేశం అయ్యారు. వెస్ట్రన్ దేశాలు రష్యాను వలస రాజ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కొత్తగా విలీనం అయిన ప్రాంతాల్లో అణ్వాయుధ వినియోగం గురించి పుతిన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాలను రెండుసార్లు ఉపయోగించిన ఏకైక దేశం అమెరికా అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మేము మా భూభాగాన్ని రక్షించుకుంటామని.. ఇది రష్యా ప్రజల విముక్తి పోరాటం అని ఆయన అన్నారు. ఈ నాలుగు ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పటికీ రష్యా పౌరులే అని పుతిన్ అన్నారు. లూహాన్స్క్, డోనెట్క్స్, జపోరిజ్జియా, ఖేర్సర్ ప్రాంతాల్లోని ప్రజలు రష్యాలో చేరేందుకు సిద్ధ పడ్డారని వీరంతా ఇకపై మా ప్రజలే అని పుతిన్ స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రారంభం అయిన యుద్ధం ఏడు నెలలుగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా విలీనం తరువాత తొలిసారిగా ఉక్రెయిన్ చర్చలకు రావాలని పుతిన్ కోరారు. ఇదిలా ఉంటే రష్యా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సరైంది కాదని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ నాలుగు ప్రాంతాలు రష్యా నియంతృత్వానికి లొంగవని ఉక్రెయిన్ హెచ్చరించింది. 2014 నుంచి ఈ నాలుగు ప్రాంతాల్లో రష్యా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా ఈ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాయి. ప్రస్తుతం ఈ నాలుగు ప్రాంతాలు అధికారికంగా విలీనం చేసుకున్న తరువాత ఈ భూభాగాల్లోకి నాటో దళాలు అడుగుపెట్టలేవు.
తాజావార్తలు
-
Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
-
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్గా ‘కేరళ’ కింగ్!
-
Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
-
Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!
-
Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా…?
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!