Congress Leader Seek Bharat Ratna For Mulayam Singh Yadav: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇటీవల మరణించారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ కు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్..ములాయంకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.
Gujarat Election Dates To Be Announced At Noon Today: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించనుంది. డిసెంబర్-జనవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించిన ఈసీ.. ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఫిబ్రవరి 18,2023తో గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి ముగియనుంది. దీంతో ఈ మధ్యలోనే ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ మధ్యాహ్నం…
Number Of Foreign Terrorists Operating In Kashmir Has Increased: జమ్మూ కాశ్మీర్లో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఆర్టికల్ 370 తరువాత కేంద్ర తీసుకున్న చర్యల వల్ల కాశ్మీర్ యువత ఉపాధి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు లోయలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా పాకిస్తాన్ కుటిల ప్రయత్నాలకు పాల్పడుతూనే ఉంది. ఆ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులను పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఇండియాలోకి పంపిస్తోంది. పాక్ ఆక్రమిత […]
By-elections in Munugode, Adampur, Andheri East and 4 other seats: తెలంగాణలో మునుగోడుతో పాటు దేశవ్యాప్తంగా పలు కీలక అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల కాలంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా ఆ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికలకు కీలకంగా మారాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఈ రోజు జరగుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు…
UK's Rishi Sunak Committed To Free Trade Pact With India: ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న యూకే.. భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి చర్చలు కొనసాగుతన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈ ఒప్పందంపై కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఇండియాతో ఈ వాణిజ్య ఒప్పందం కుదిరితేనే బ్రిటన్ ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్న సమయం…
Ukraine Sought Pakistan’s Help For Developing Nuclear Weapons: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు పాకిస్తాన్ సాయం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అణ్వాయుధాలను అభివృద్ధి కోసం ఉక్రెయిన్, పాకిస్తాన్ సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ వెళ్లినట్లు రష్యా సెనెటర్ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే రష్యా, పాకిస్తాన్ ను హెచ్చరించించినట్లు తెలుస్తోంది.
India had clearly told Colombo not to allow docking of Chinese military vessels: చైనా బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ నౌక వాంగ్ యువాన్ 5ను హంబన్ టోట వద్ద డాకింగ్ చేయడానికి కొన్ని నెలల క్రితం శ్రీలంక అనుమతి ఇచ్చింది. భారత్ ఎన్ని అభ్యంతరాలను తెలిపినా.. శ్రీలంక ఆ నౌకకు అనుమతి ఇచ్చింది. శ్రీలంక నుంచే భారత్ అణు కార్యక్రమాలు, క్షిపణి కార్యక్రమాలు, స్పేస్ ఏజెన్సీపై నిఘా పెట్టే అవకాశం ఉంటుందని భారత్ ఆందోళన చెందింది. ఇదిలా ఉంటే చైనా…
Benjamin Netanyahu as Prime Minister of Israel.. Exit polls revealed: ఇజ్రాయిల్ దేశంలో ఎన్నికలు ముగిశాయి. ఆ దేశ పార్లమెంట్ కనాసెట్ కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. గత నాలుగేళ్లలో ఇజ్రాయిల్ లో ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ సారి భారతదేశానికి మిత్రుడిగా, ప్రధాన మంత్రితో మంచి స్నేహం ఉన్న బెంజిమిన్ నెతన్యాహు తిరిగి అధికారంలోకి వస్తారని తెలుస్తోంది. అక్కడి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మంగళవారం ఎన్నిలక తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో…
InSight lander mission will come to an end in the coming weeks: అంగారకుడి గురించి ఎన్నో వివరాలను అందించిన ఇన్సైట్ ల్యాండర్ మరికొన్ని రోజుల్లో మూగబోనుంది. 2018లో అంగారకుడిని చేరుకున్న ఇన్సైట్ ల్యాండర్ అంగారకుడి అంతర్గత పొరల్లో నిర్మాణాలను, అంగారకుడిపై వచ్చే మార్స్క్వేక్లను( అంగారకుడిపై భూకంపాలు) గుర్తించింది. ఇప్పటి వరకు 1,300 కంటే ఎక్కువ మార్స్క్వేక్లను గుర్తించింది ఇన్సైట్ ల్యాండర్. అంగారుకుడిపై నాలుగు సంవత్సరాలుగా ఇన్సైట్ ల్యాండర్ పనిచేస్తోంది.
China Locks Down Area Around iPhone Factory: చైనాలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ ను కఠినంగా అమలు చేస్తోంది. చైనా ప్రజల నుంచి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అధ్యక్షుడు జి జిన్ పింగ్ పై విమర్శలు, నిరసన వ్యక్తం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. తాజాగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాన్ని బుధవారం దిగ్బంధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా లాక్ చేశారు. కోవిడ్ నివారణ వాలంటీర్లు, అవసరమైన కార్మికులు తప్ప ప్రజలంతా…