Jammu Kashmir: కాశ్మీర్లో పెరిగిన విదేశీ ఉగ్రవాదులు.. కేంద్రం వెల్లడి.
Number Of Foreign Terrorists Operating In Kashmir Has Increased: జమ్మూ కాశ్మీర్లో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఆర్టికల్ 370 తరువాత కేంద్ర తీసుకున్న చర్యల వల్ల కాశ్మీర్ యువత ఉపాధి పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు లోయలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా పాకిస్తాన్ కుటిల ప్రయత్నాలకు పాల్పడుతూనే ఉంది. ఆ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులను పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఇండియాలోకి పంపిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నాయి పలు ఉగ్రవాద సంస్థలు. అదును చూసి సరిహద్దును దాటిస్తున్నాయి.
Read Also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం
Also Read
- Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
ఇదిలా ఉంటే ఈ ఏడాది చొరబాట్లు చాలా వరకు తగ్గాయిని భద్రతా బలగాలు పేర్కొంటున్నా..కాశ్మీర్ లో మాత్రం విదేశీ ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన 134 మంది ఉగ్రవాదులు ఉంటే ఇందులో 83 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించింది. కేవలం 51 మంది మాత్రమే స్థానికులని వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 167 మంది మందిని భద్రతా బలగాలు హతమర్చాయి. ఇందులో 41 మంది పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. గతేడాది గణాంకాలతో పోలిస్తే.. గతేడాది 184 మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉంటే అందులో 85 మంది విదేశీయులు కాగా.. 99 మంది స్థానికులు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్థానిక ఉగ్రవాదుల సంఖ్య చాలా వరకు తగ్గింది. కేంద్ర చేపడుతున్న సంక్షేమ చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి.
పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో ఉన్న సమయంలో సరిహద్దుల్లో ఉగ్రవాదుల సంఖ్య 75 శాతం తగ్గిందని హోంశాఖ వెల్లడించింది. అయితే పాకిస్తాన్ గ్రే లిస్టు నుంచి బయటపడుతుందని చెప్పిన వెంటనే ఉగ్రవాద స్థావరాల సంఖ్య 50 శాతం పెరిగిందని అధికారులు వెల్లడిచారు. ప్రభుత్వ డేటా ప్రకారం 2018లో జమ్మూ కాశ్మీర్ అంతటా 600 ఉగ్రవాద శిబిరాలు ఉంటే.. 2021 నాటికి 150కి తగ్గిందని.. 2022 నాటికి వీటి సంఖ్య 225 పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కాశ్మీర్ లో సవాళ్లు పెరిగాయని సీఆర్పీఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ అన్నారు.
తాజావార్తలు
-
Paytm: టెన్షన్ వద్దు.. మీ డబ్బులు సేఫ్! పేటియం బ్యాంక్ లైసెన్స్ రద్దైనా డబ్బు ఎలా వస్తుందంటే..
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!