Nara Lokesh: పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి..
- పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి..
- నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహణ మెరుగుపడింది..
- పార్టీ కార్యక్రమాల అమలుతీరును నిరంతరం పర్యవేక్షించాలి..
- టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశంలో మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: అందరికీ పార్టీనే సుప్రీం.. పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని మంత్రి నారా లోకేష్ టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ఆయా నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ నిర్వహణ మెరుగుపడింది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేలా జోనల్ కోఆర్డినేటర్లు చొరవ చూపాలి అన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో జోనల్ కోఆర్డినేటర్లు పర్యవేక్షించాలి. ఏమైనా లోటు పాట్లు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెండింగ్ లో ఉన్న అనుబంధ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తిచేయాలి.. మిగిలిన సంస్థాగత కమిటీల నియామకం కూడా పూర్తి చేయాలని నారా లోకేష్ ఆదేశించారు.
Read Also: Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేస్.. సోనమ్ రఘువంశీకి బెయిల్ తిరస్కరణ..
Also Read
- 'Thara' Mantra: సైబర్ దొంగల వేటలో ‘టాలీవుడ్ తారలు’.. వైజాగ్ పోలీసుల ‘తార’ మంత్రం మామూలుగా లేదుగా!
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
ఇక, నియోజకవర్గాల్లో జరిగే గ్రీవెన్స్ లలో సమస్యలు ఎంత వరకు పరిష్కారం అవుతున్నాయని మంత్రి లోకేష్ అడిగారు. కోఆర్డినేటర్లు దీనికి సంబంధించిన నివేదికను తయారు చేయాలని సూచించారు. డీడీఆర్సీ సమావేశం జరిగే రోజే ఇంఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరుపుకోవాలని తెలిపారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయ నిర్మాణం గురించి ఇంఛార్జి మంత్రితో కలిపి కోఆర్డినేటర్లు చర్చించాలని చెప్పారు. పెండింగ్ లో ఉన్న పార్టీ కమిటీలపై దృష్టి పెట్టాలి.. మిగిలిన నామినేటెడ్ పదవులకు అర్హులైన అభ్యర్థుల జాబితాను రెడీ చేయాలి.. గత ప్రభుత్వ హయాంలో అకారణంగా మన కార్యకర్తలపై నాయకులపై కేసులు పెట్టారు.. ఆ కేసులను చట్టపరంగా త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని లోకేష్ సూచించారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..