China: ఉద్యోగులు పారిపోతున్నారని ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Locks Down Area Around iPhone Factory: చైనాలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ ను కఠినంగా అమలు చేస్తోంది. చైనా ప్రజల నుంచి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అధ్యక్షుడు జి జిన్ పింగ్ పై విమర్శలు, నిరసన వ్యక్తం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. తాజాగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాన్ని బుధవారం దిగ్బంధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా లాక్ చేశారు. కోవిడ్ నివారణ వాలంటీర్లు, అవసరమైన కార్మికులు తప్ప ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని చైనా ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ టెస్టులు, వైద్యం పొందడానికి తప్పితే ఇతర ఏ అవసరాలకైనా ప్రజలు బయటకు రావద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది.
Read Also: Indian Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..
Also Read
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
తైవాన్ టెక్ దిగ్గజం ఫాక్స్కాన్ నడుపుతున్న ఈ ప్రాంతం వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇటీవల ఈ ప్రాంతం నుంచి కొంత మంది ఉద్యోగులు ప్రభుత్వ కఠిన నియమాలు తట్టుకోలేక ఫెన్సింగ్ దూకి పారిపోతున్న వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఈ చర్య తరువాత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జెంగ్జౌ నగరంలో అంతా వర్క్ ఫ్రం హోం చేయాలని, కీలక సంస్థలు మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తాయని, వైద్యం, నిత్యావసర పంపిణీ వాహనాలను మాత్రమే వీధుల్లోకి అనుమతిస్తామని తెలపింది అక్కడి ప్రభుత్వం. ఎవరైనా కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తం అయింది. ఒకవేళ ఫాక్స్కాన్ కార్మికులు వస్తే అధికారుల వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు కఠినమైన ఐసోలేషన్ పాటించాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే చైనాలో వరసగా మూడవ రోజు బుధవారం 2,000 కన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్న కార్మికులకు బోనస్ నాలుగు రెట్టు పెంచుతామని కంపెనీ ప్రకటించింది. జెంగ్ జౌ ఉన్న హెనాన్ ప్రావిన్స్ లో బుధవారం అధికారికిగా 359 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. అంతకుముందు రోజు కన్నా 104 కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతున్న కారణంగా దక్షిణ చైనా తయారీ కేంద్రమైన గ్వాంగ్ జౌ నగరంలో పాక్షిక లాక్ డౌన్ విధించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!