China: ఉద్యోగులు పారిపోతున్నారని ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Locks Down Area Around iPhone Factory: చైనాలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ ను కఠినంగా అమలు చేస్తోంది. చైనా ప్రజల నుంచి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అధ్యక్షుడు జి జిన్ పింగ్ పై విమర్శలు, నిరసన వ్యక్తం అవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. తాజాగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాన్ని బుధవారం దిగ్బంధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా లాక్ చేశారు. కోవిడ్ నివారణ వాలంటీర్లు, అవసరమైన కార్మికులు తప్ప ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని చైనా ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ టెస్టులు, వైద్యం పొందడానికి తప్పితే ఇతర ఏ అవసరాలకైనా ప్రజలు బయటకు రావద్దని అక్కడి ప్రభుత్వం సూచించింది.
Read Also: Indian Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..
Also Read
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
- Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
- Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
తైవాన్ టెక్ దిగ్గజం ఫాక్స్కాన్ నడుపుతున్న ఈ ప్రాంతం వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇటీవల ఈ ప్రాంతం నుంచి కొంత మంది ఉద్యోగులు ప్రభుత్వ కఠిన నియమాలు తట్టుకోలేక ఫెన్సింగ్ దూకి పారిపోతున్న వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఈ చర్య తరువాత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జెంగ్జౌ నగరంలో అంతా వర్క్ ఫ్రం హోం చేయాలని, కీలక సంస్థలు మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తాయని, వైద్యం, నిత్యావసర పంపిణీ వాహనాలను మాత్రమే వీధుల్లోకి అనుమతిస్తామని తెలపింది అక్కడి ప్రభుత్వం. ఎవరైనా కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తం అయింది. ఒకవేళ ఫాక్స్కాన్ కార్మికులు వస్తే అధికారుల వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు కఠినమైన ఐసోలేషన్ పాటించాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే చైనాలో వరసగా మూడవ రోజు బుధవారం 2,000 కన్నా ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్న కార్మికులకు బోనస్ నాలుగు రెట్టు పెంచుతామని కంపెనీ ప్రకటించింది. జెంగ్ జౌ ఉన్న హెనాన్ ప్రావిన్స్ లో బుధవారం అధికారికిగా 359 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. అంతకుముందు రోజు కన్నా 104 కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతున్న కారణంగా దక్షిణ చైనా తయారీ కేంద్రమైన గ్వాంగ్ జౌ నగరంలో పాక్షిక లాక్ డౌన్ విధించారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!