India: శ్రీలంకలో చైనా నౌకల డాకింగ్కు అనుమతించవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India had clearly told Colombo not to allow docking of Chinese military vessels: చైనా బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ నౌక వాంగ్ యువాన్ 5ను హంబన్ టోట వద్ద డాకింగ్ చేయడానికి కొన్ని నెలల క్రితం శ్రీలంక అనుమతి ఇచ్చింది. భారత్ ఎన్ని అభ్యంతరాలను తెలిపినా.. శ్రీలంక ఆ నౌకకు అనుమతి ఇచ్చింది. శ్రీలంక నుంచే భారత్ అణు కార్యక్రమాలు, క్షిపణి కార్యక్రమాలు, స్పేస్ ఏజెన్సీపై నిఘా పెట్టే అవకాశం ఉంటుందని భారత్ ఆందోళన చెందింది. ఇదిలా ఉంటే చైనా సైనిక నౌకలు నిలిపేసేందుకు అనుమతి ఇవ్వద్దని అమెరికా, భారత్ శ్రీలంకను కోరాయి.
చైనా నౌకలు హంబన్తోట పోర్టుల్లో ఇంధనం నింపుకోవడానికి అనుమతించవద్దని భారత్, శ్రీలంకను కోరింది. తూర్పు ఆఫ్రికా తీరంలో యాంటీ పైరసీ టాస్క్ ఫోర్సు పేరుతో చైనా నౌకలు తిరుగుతున్నాయి. చైనా బాలిస్టిక్ క్షిపణి ట్రాకింగ్ షిప్ వాంగ్ యువాన్ 5 హంబన్తోట ఓడరేవులో డాకింగ్ చేసుకునేందుకు అనుమతించిన రణిల్ విక్రమసింఘే ప్రభుత్వానికి ఇకపై చైనా నుంచి వచ్చే సైనిక నౌకలు, నిఘా నౌకలకు ఓడరేవుల్లో డాకింగ్ చేసే అనుమతి ఇవ్వవద్దని అమెరికాతో పాటు భారత్ శ్రీలంకకు స్పష్టం చేశాయి. హిందూ మహాసముద్రం, ముఖ్యంగా భారత్ పై నిఘా పెట్టేందుకు జిత్తులమారి చైనా ప్రయత్నిస్తోంది.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధానిగా మోదీ ఫ్రెండ్.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..
రాజపక్స పాలనలో చైనాకు హంబన్తోట రేవును 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఆ సమయంలో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే భారత అభ్యంతరాలను శ్రీలంక ఏ మాత్రం పట్టించుకోలేదు. శ్రీలంకలో భారీగా పెట్టుబడులు పెట్టిన చైనా.. పరోక్షంగా ఆ దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణం అయింది. ఇదిలా ఉంటే శ్రీలంక ట్రింకోమలీ ఓడరేవులో పాకిస్తాన్ నేవీకి చెందిన ఫ్రిగేట్ తైమూర్ డాక్ చేయడానికి కూడా శ్రీలంక అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కూడా భారత్ అభ్యంతరాలను శ్రీలంక పట్టించుకోలేదు.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన శ్రీలంకకు భారత్ మినహా ఏ ఒక్కదేశం కూడా సాయం చేయలేదు. చివరకు తన స్నేహితుడుగా భావించిన చైనా కూడా శ్రీలంక వైపు చూడలేదు. ఇండియా, శ్రీలంకకు మందులు, పెట్రోల్, ధాన్యాన్ని సరఫరా చేసి ఆదుకుంది. అయినా కూడా శ్రీలంక తీరు మారడం లేదు. భారత విరోధులతో సన్నిహితంగా ఉంటోది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!