Venu Goapl Reddy
Author- NTV Telugu-
NASA: అంగారకుడిపై ఎగిరిన బుల్లి హెలికాప్టర్.. వీడియో..
NASA: రెండేళ్ల క్రితం నాసా అంగారకుడిపైకి పరిశోధన నిమిత్తం పర్సువరెన్స్ రోవర్ తోపాటు ఓ తేలికపాటి ఎగిరే హెలికాప్టర్ ను పంపింది. మార్స్ పై ఉండే తేలికపాటి వాతావరణంలో ఇంజెన్యూటీ హెలికాప్టర్ ఎగురుతుందా..? లేదా..? అనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు రోవర్ తో పాటు పంపించాయి. ఇప్పటికే పలు మార్లు అంగారకుడి వాతావరణంపై ఈ హెలికాప్టర్ ఎగిరింది. తాజాగా 50వ సారి ఎగిరింది. ఏప్రిల్ 13న ఈ చిన్న హెలికాప్టర్ 145.7 సెకన్లలో 1,057.09 అడుగుల (322.2 మీటర్లు) ఎత్తు వరకు ప్రయాణించింది. -
MHA: అతిక్ అహ్మద్ హత్య.. జర్నలిస్టుల కోసం కేంద్రం మార్గదర్శకాలు..
After Atiq Ahmed Murder, Centre Prepares Advisory For Journalists: ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పోలీస్ కస్టడీలో ఉన్న అతిక్ అహ్మద్ అతని సోదరులు అఫ్రాప్ అహ్మద్ లను పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చిచంపారు ముగ్గురు నిందితులు. అతిక్, అఫ్రాఫ్ లను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకువస్తున్న సమయంలో జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు నిందితులు దగ్గర నుంచి కాల్చి చంపారు. -
Atiq Ahmed: 17 ఏళ్లకే మర్డర్.. 27 ఏళ్లకు ఎమ్మెల్యే.. 44 ఏళ్ల క్రిమినల్ హిస్టరీ..
Atiq Ahmed: అతిక్ అహ్మద్ ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్, ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో తిరుగులేని డాన్ గా ఎదిగాడు. చివరి రోజులను మాత్రం సీఎం యోగి ఆదిత్య నాథ్ దెబ్బకు బయపడుతూ బతికాడు. ఉత్తర్ ప్రదేశ్ వస్తే ఎప్పుడు ఎన్ కౌంటర్ అవుతానో అని తీవ్రంగా భయపడేవాడు. శనివారం రాత్రి ముగ్గురు నిందితుల చేతిలో అతిక్ అహ్మద్ తో పాటు అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురయ్యారు. -
Uttar Pradesh: మూడేళ్ల పాపపై 10 ఏళ్ల బాలుడి అత్యాచారం..
Uttar Pradesh: దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా అత్యాచారాలకు పాల్పడుతుండటం సమాజాన్ని కలవరపరుస్తోంది. తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడటం షాక్ కు గురిచేస్తోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. -
Elephant Fights Off Crocodile: బిడ్డను రక్షించడానికి మొసలితో ఏనుగు పోరాటం.. వీడియో వైరల్..
ఒక నెటిజన్.. ‘‘మొసలి రక్షించబడింది, లేకపోతే దాని లోపల ఉన్న మొత్తం బయటకు వచ్చేది’’ అని వ్యాఖ్యానించారు. మరొకరు మొసలి తప్పించుకున్నా కూడా తన పిల్లను రక్షించుకోవడానికి ఇంకా తల్లి ఏనుగు చెరువులో వెతుకుతూనే ఉందని, ఇది తల్లి పిల్లల రక్షణ పట్ల ఉన్న ప్రవృత్తి అన్నారు. -
Imran Khan: పాక్ ఆర్మీ చీఫ్ పై ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు.. మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్ అంటూ..
Imran Khan: ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల మధ్య పాకిస్తాన్ బతుకీడుస్తోంది. అక్కడి జనాలకు తినడానికి తిండి కరువైంది. విదేశీమారక నిల్వలు లేక దిగుమతులు చేసుకోలేని పరిస్థితి. అరబ్ దేశాలు, ఆల్ టైం ఫ్రెండ్ చైనా కూడా పెద్దగా పాకిస్తాన్ ను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో పాక్ ప్రభుత్వం, -
Tomatoes grown in space: అంతరిక్షంలో పండించిన టొమాటో… భూమికి తీసుకువస్తున్న డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్
Tomatoes grown in space: అంతరిక్షం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. మనం ఇప్పటి వరకు అంతరిక్షం గురించి, విశ్వం గురించి తెలుసుకుంది చాలా తక్కువ మాత్రమే. అంతరిక్షంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భూమి నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ పూర్తిగా శూన్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటుంది. ఈ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములు కొన్ని నెలల పాటు ఉంటూ పలు పరిశోధనలు చేస్తుంటారు. -
Madhya Pradesh: కరోనాతో చనిపోయినట్లు ప్రకటించబడిన వ్యక్తి.. రెండేళ్ల తర్వాత సజీవంగా ఇంటికి..
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడని అధికారుల చేత నిర్థారించబడిన వ్యక్తి రెండేళ్లకు సజీవంగా ఇంటికి రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని, సన్నిహితులను షాకింగ్ కు గురిచేయడంతో పాటు తమ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తెలుసుకుని అంతా సంతోషిస్తున్నారు. -
Bandi Sanjay: కేసీఆర్కి వారు మాత్రమే బలగం.. బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలు
Bandi Sanjay: ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ లో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు. ఇదే వరంగల్ గడ్డపై తనను అరెస్ట్ చేశారని, కేసీఆర్ కి బలగం కేవలం కొడుకు, కూతురు, అల్లుడే అని, బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలని ఆయన అన్నారు. -
Amit Shah: “పైలట్ జీ మీ నంబర్ ఎప్పుడూ రాదు”.. రాజస్థాన్ కాంగ్రెస్ పోరుపై అమిత్ షా వ్యాఖ్యలు..
ఇటీవల బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజే అవినీతిపై చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావిస్తూ సచిన్ పైలెట్ దీక్ష చేపట్టారు. దీంతో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ల మధ్య మరోసారి విభేదాలు బయటకు వచ్చాయి. ఈ సమస్యను సద్దుమణిగేలా చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!