Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేస్.. సోనమ్ రఘువంశీకి బెయిల్ తిరస్కరణ..
- మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసు..
- సోనమ్ రఘువంశీకి బెయిల్ తిరస్కరణ..
- మూడోసారి బెయిల్ తిరస్కరించిన కోర్టు..
- హనీమూన్ పేరుతో రాజా రఘువంశీ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్ గురించి దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీని, అతడి భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా కలిసి దారుణంగా హత్య చేశారు. హనీమూన్ పేరిటి మేఘాలయా తీసుకెళ్లి హతమార్చారు. అయితే, ఈ కేసులో మరోసారి నిందితురాలు సోనమ్ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడం ఇది మూడోసారి. ఈ కేసులో సోనమ్ ప్రధాన నిందితురాలిగా ఉంది.
Read Also: Off The Record: విశాఖలో గూగుల్ కు భూ కేటాయింపు కొత్త మలుపు తిరగబోతుందా?
Also Read
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో, దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. హత్యలో సోనమ్ పాత్రపై విచారణ మరింత తీవ్రమైంది. ఈ కేసుపై రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రఘువంశీ మాట్లాడుతూ.. ఆయన సోనమ్ నిర్దోషిత్వాన్ని ప్రశ్నించారు. సోనమ్ హనీమూన్ వెళ్లడానికి ముందే, తన వ్యక్తిగ వస్తువులన్నింటిని రాజ్ కుశ్వాహకు అప్పగించిందని ఆయన ఆరోపించారు. రాజా హత్య తర్వాత, సోనమ్ తన అత్తమామల ఇంటికి రాకుండా, నేరుగా రాజ్ కుశ్వాహ వద్దకు వెళ్లిందని ఆయన చెప్పారు. సోనమ్ చెబుతున్న వాటిని నమ్మడం సాధ్యం కాదని చెప్పారు. బెయిల్ పిటిషన్లో తాను రాజాతో వివాహంపై సంతోషంగా ఉన్నానని చెప్పింది. అయితే, సోనమ్ ఎప్పుడూ ఆనందం అనే ముసుగు వేసుకుని ఉండేదని విపిన్ ఆరోపించాడు. హనీమూన్కు రాజా వెళ్లకూడదని అనుకున్నప్పటికీ, బలవంతంగా సోనమ్ టికెట్స్ బుక్ చేయించిందని, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమే అని అతను చెప్పాడు.
హత్య తర్వాత, ఆమె ఎవరి సాయం కోరకుండా షిల్లాంగ్ నుంచి ఇండోర్ ప్రయాణించిందని, అత్తమామల ఇంటికి రాకుండా రాజ్ కుశ్వాహా ఇంటికి ఎందుకు వెళ్లిందని విపిన్ ప్రశ్నించారు. రాజ్ను సోనమ్ తన సోదరుడిగా భావించినట్లయితే, హత్య తర్వాత అతనితో ఎందుకు దాక్కుంది? అని అడిగాడు. రాజా రఘువంశీ తండ్రి అశోక్ రఘువంశీ కూడా ఇలాంటి ప్రశ్నల్నే లేవనెత్తారు. ఆమెకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా సోమన్, రాజ్ కుశ్వాహాలు రిలేషన్లో ఉన్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
-
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!