Gujarat Elections: ఈ రోజు మధ్యాహ్నం వెలువడనున్న గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Election Dates To Be Announced At Noon Today: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించనుంది. డిసెంబర్-జనవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించిన ఈసీ.. ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఫిబ్రవరి 18,2023తో గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి ముగియనుంది. దీంతో ఈ మధ్యలోనే ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ ప్రకటించనున్నారు.
182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండీ.. అధికారంలో ఉంది. గత 25 ఏళ్ల నుంచి గుజరాత్ లో బీజేపీ తిరుగులేని విజయాలను సాధిస్తోంది. అంతగా అక్కడ బీజేపీ బలంగా ఉంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. పంజాబ్ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలు గెలుచుకుంటే.. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది.
Also Read
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
Read Also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం
నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటిస్తామని ఇది వరకే ఈసీ వెల్లడించింది. గుజరాత్ షెడ్యూల్ ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన మోర్బీ వంతెన కూలిన ఘటన బీజేపీ విజయవకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ఎన్నికల్లో బీజేపీని ఎలా విజయతీరాలకు చేరస్తారో చూడాలి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. దేశ ప్రజల మూడ్ ను వ్యక్తం చేసేలా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!