Gujarat Elections: ఈ రోజు మధ్యాహ్నం వెలువడనున్న గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Election Dates To Be Announced At Noon Today: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించనుంది. డిసెంబర్-జనవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించిన ఈసీ.. ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఫిబ్రవరి 18,2023తో గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి ముగియనుంది. దీంతో ఈ మధ్యలోనే ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ ప్రకటించనున్నారు.
182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండీ.. అధికారంలో ఉంది. గత 25 ఏళ్ల నుంచి గుజరాత్ లో బీజేపీ తిరుగులేని విజయాలను సాధిస్తోంది. అంతగా అక్కడ బీజేపీ బలంగా ఉంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. పంజాబ్ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలు గెలుచుకుంటే.. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది.
Also Read
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
- Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
Read Also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం
నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటిస్తామని ఇది వరకే ఈసీ వెల్లడించింది. గుజరాత్ షెడ్యూల్ ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన మోర్బీ వంతెన కూలిన ఘటన బీజేపీ విజయవకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ఎన్నికల్లో బీజేపీని ఎలా విజయతీరాలకు చేరస్తారో చూడాలి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. దేశ ప్రజల మూడ్ ను వ్యక్తం చేసేలా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?