Gujarat Elections: ఈ రోజు మధ్యాహ్నం వెలువడనున్న గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Election Dates To Be Announced At Noon Today: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించనుంది. డిసెంబర్-జనవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించిన ఈసీ.. ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఫిబ్రవరి 18,2023తో గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి ముగియనుంది. దీంతో ఈ మధ్యలోనే ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ ప్రకటించనున్నారు.
182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండీ.. అధికారంలో ఉంది. గత 25 ఏళ్ల నుంచి గుజరాత్ లో బీజేపీ తిరుగులేని విజయాలను సాధిస్తోంది. అంతగా అక్కడ బీజేపీ బలంగా ఉంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. పంజాబ్ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలు గెలుచుకుంటే.. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం
నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటిస్తామని ఇది వరకే ఈసీ వెల్లడించింది. గుజరాత్ షెడ్యూల్ ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన మోర్బీ వంతెన కూలిన ఘటన బీజేపీ విజయవకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ఎన్నికల్లో బీజేపీని ఎలా విజయతీరాలకు చేరస్తారో చూడాలి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. దేశ ప్రజల మూడ్ ను వ్యక్తం చేసేలా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!