Gujarat Elections: ఈ రోజు మధ్యాహ్నం వెలువడనున్న గుజరాత్ ఎన్నికల షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Election Dates To Be Announced At Noon Today: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించనుంది. డిసెంబర్-జనవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించిన ఈసీ.. ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఫిబ్రవరి 18,2023తో గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి ముగియనుంది. దీంతో ఈ మధ్యలోనే ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ ప్రకటించనున్నారు.
182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండీ.. అధికారంలో ఉంది. గత 25 ఏళ్ల నుంచి గుజరాత్ లో బీజేపీ తిరుగులేని విజయాలను సాధిస్తోంది. అంతగా అక్కడ బీజేపీ బలంగా ఉంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. పంజాబ్ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలు గెలుచుకుంటే.. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం
నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటిస్తామని ఇది వరకే ఈసీ వెల్లడించింది. గుజరాత్ షెడ్యూల్ ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన మోర్బీ వంతెన కూలిన ఘటన బీజేపీ విజయవకాశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ఎన్నికల్లో బీజేపీని ఎలా విజయతీరాలకు చేరస్తారో చూడాలి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. దేశ ప్రజల మూడ్ ను వ్యక్తం చేసేలా ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!