Venu Goapl Reddy
Author- NTV Telugu-
Hathras case: హత్రాస్ అత్యాచారం కేసులో కీలక తీర్పు.. ఒకరికి జీవిత ఖైదు..
Hathras case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ అత్యాచార ఘటన. దేశ రాజకీయాలన్నీ ఈ ఘటన చుట్టూనే తిరిగాయి. ఇదిలా ఉంటే ఈ కేసు ఎస్సీ/ఎస్టీ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 2020లో జరిగిన ఈ ఘటనలో నలుగురు నిందితుల్లో ఒకరికి జీవిత ఖైదు విధించగా.. మరో ముగ్గురిని నిర్దోషులుగా గురువారం కోర్టు ప్రకటించింది. -
MK Stalin: బీజేపీని ఓడించడం, మోదీ ప్రధాని కాకుండా చూడటమే మా లక్ష్యం..
MK Stalin: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారంలోకి రాకుండా చూడటం, ప్రధాని మోదీ మళ్లీ ప్రధాని కాకుండా చూడటం తమ లక్ష్యమని, విపక్షాలు అందుకోసమే ప్రయత్నిస్తున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. స్టాలిన్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూఖ్ అబ్దుల్లా కోరడంపై మాట్లాడుతూ.. తాను ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనే నిమగ్నమై ఉన్నానని స్టాలిన్ అన్నారు. -
Rajnath Singh: రాహుల్ గాంధీ కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నా..
Rajnath Singh On Rahul Gandhi: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ సాయుధబలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నానని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో నందగఢ్ లో బీజేపీ ‘‘విజయ్ సంకల్ఫ్ యాత్ర’’ రెండో విడతను ప్రారంభించిన ఆయన, వచ్చే కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. -
Bengaluru: మా అమ్మ నిద్ర పోతుంది.. తల్లి శవం పక్కనే రెండ్రోజులుగా కొడుకు..
Bengaluru: బెంగళూర్ లో హృదయవిదారక ఘటన జరిగింది. తల్లి మరణించినా, నిద్ర పోతుందని భావించిన పిల్లాడి అమాయకత్వాన్ని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అసలు అమ్మ ఎందుకు లేవడం లేదో తెలియదు, మాట్లాడదు, కదలదు, తనకు అన్నం పెట్టదు.. అయినా అమాయకంగా తన తల్లి నిద్ర పోతుందని భావించాడు ఆ పిల్లాడు. తల్లి మరణించినా రెండు రోజలు పాటు మృతదేహం పక్కనే నిద్రించాడు. -
Russia: మేం ఒంటరి కావడం లేదు.. మీరే అవుతున్నారు.. పాశ్చాత్య దేశాలపై రష్యా ఆగ్రహం
Russia Condemns Western Blackmail: ఇండియాలో జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాలకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో పాశ్చాత్యదేశాలు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాయని, ఇందుకు జీ20 సమావేశాలను వేదికగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించడానికి ఇదే మంచి సమయం అని లావ్రోవ్ అన్నారు. వెస్ట్రన్ దేశాలు అనేక ఏళ్లుగా రష్యాపై యుద్ధానికి ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను అందిస్తున్నాయని దుయ్యబట్టారు. -
Kerala: డాక్టర్పై నర్స్ అత్యాచారం.. న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్..
Physical Abuse On Female Doctor: కేరళలో దారుణం జరిగింది. ఉద్యోగం పేరుతో నమ్మించి మేల్ నర్స్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి డాక్టర్ పై అత్యాచారం చేశాడు. ఇంతటితో ఆగకుండా మహిళా డాక్టర్ న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ, చివరకు వాటిని ఆన్ లైన్ లో షేర్ చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
Brain Eating Amoeba: ట్యాప్ వాటర్ తో ముక్కు కడుక్కుంటేనే చనిపోతారా..? అమెరికాలో ఓ వ్యక్తి మరణం..
Brain Eating Amoeba: ట్యాప్ వాటర్ లో ముక్కు కడుక్కున్నందుకు ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని సౌత్ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. కుళాయి నీటిలో ముక్కును శుభ్రం చేసుకున్న సమయంలో నీటిలో ఉన్న అమీబా సదరు వ్యక్తి శరీరంలోకి ప్రవేశించింది. అత్యంత అరుదుగా సోకే ‘‘మెదడును తినే అమీబా’’ నెగ్లిరియా ఫౌలోరి కారణంగా అతను మరణించాడని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. షార్లెట్ కౌంటీ నివాసి అయిన వ్యక్తి, ఫిబ్రవరి 20 న మరణించాడు. -
Vijayapriya Nithyananda: ఎవరీ విజయప్రియ నిత్యానంద.. ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించే చర్చ..
Vijayapriya Nithyananda: విజయప్రియ నిత్యానంద ఎవరు..? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. భారత్ తో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మతగురువు నిత్యానంద ‘కైలాస’ అనే ప్రత్యేక దేశాన్ని స్థాపించారు. అయితే ఈ దేశానికి ప్రతినిధులుగా ఇటీవల ఐక్యరాజ్యసమితిలో విజయప్రియ నిత్యానంద కనిపించారు. తనను తాను ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నారు. -
Tripura: బీజేపీని సవాల్ చేసిన త్రిపా మోథా.. ఆ ఒక్కటి తప్పా అన్నింటికి సిద్ధమన్న కాషాయపార్టీ..
Tripura Election Results: ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లే త్రిపులో బీజేపీ భారీ విజయం సాధించింది. కమ్యూనిస్టుల కంచుకోటను కూల్చిన బీజేపీ వరసగా రెండో సారి ఆ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. ఈ రోజు వెల్లడించిన అసెంబ్లీ ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటి మెజారిటీ స్థానాలు సాధించింది. త్రిపులో మొత్తం 60 స్థానాలు ఉంటే ఇప్పటికే బీజేపీ 34 చోట్ల విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 26 చోట్ల విజయం సాధించగా.. మరో 8 చోట్ల ఆధిక్యంలో… -
BJP: జాతీయ పార్టీల నిధుల్లో సగానికి పైగా బీజేపీకే.. వెల్లడించిన ఎన్నికల సంఘం..
BJP: జాతీయ పార్టీల నిధుల్లో బీజేపీ టాప్ లో నిలిచింది. ఏకంగా సగానికి పైగా నిధులు ఒక్క భారతీయ జనతా పార్టీకే వచ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2020-21లో అన్ని జాతీయ పార్టీల మొత్తం నిధుల్లో 58 శాతం నిధులు బీజేపీకి వచ్చాయి. 2021-22లో నాలుగు జాతీయ పార్టీలు తమ మొత్తం ఆదాయంలో 55.09 శాతాన్ని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారా సేకరించాయి.
తాజావార్తలు
-
Kara Movie Trailer: ధనుష్ ‘కర’ ట్రైలర్ రిలీజ్..
-
Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
-
EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
-
Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!