RBI Recruitment 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పరీక్ష రాయకుండానే జాబ్ పొందే ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
- RBI లాటరల్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ
- మొత్తం 93 పోస్టులను భర్తీ చేయనుంది
- 6 జనవరి 2026 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. పరీక్ష లేకుండానే జాబ్ పొందే అవకాశం కల్పిస్తోంది. RBI లాటరల్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 93 పోస్టులను భర్తీ చేయనుంది. డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, IT సెక్యూరిటీ ఎక్స్పర్ట్, IT సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్, రిస్క్ అకౌంట్, డేటా ఇంజనీర్, క్రెడిట్ రిస్క్ స్పెషలిస్ట్ మొదలైన పోస్టులలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:Vijay Rally: రేపు తమిళనాడులో విజయ్ భారీ ర్యాలీ.. సెలవు ప్రకటించిన ప్రైవేటు స్కూలు
Also Read
లాటరల్ రిక్రూట్మెంట్ అంటే ప్రత్యేక అర్హతల ఆధారంగా నిపుణుడిని లేదా అనుభవజ్ఞుడైన ప్రొఫెషనల్ను నేరుగా నియమించుకోవడమే. RBIకి ఈ రంగాలలో నిపుణుల అవసరం ఉంది.ఈ పోస్టులన్నీ గ్రేడ్ C పోస్టులు. పూర్తి సమయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు జరుగనున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు 6 జనవరి 2026 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
ఈ ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలు అవసరం. డేటా సైంటిస్ట్ (DIT) కోసం, స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/మ్యాథ్/డేటా సైన్స్/ఫైనాన్స్/ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ లేదా B.E./B.Tech. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అవసరం. ఆర్థిక సంస్థలో డేటా సైంటిస్ట్ గా నాలుగు సంవత్సరాల అనుభవం కూడా అవసరం. డేటా ఇంజనీర్ కోసం, B.E./B.Sc./M.Sc./M.Tech. కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ లేదా నాలుగు సంవత్సరాల అనుభవంతో MCA/తత్సమాన అర్హత కూడా అవసరం. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ లేదా MCAలో B.Sc./B.E./B.Tech./M.Sc./M.Tech .
Also Read:Saif Ali Khan : షారుఖ్-సల్మాన్ బాటలో నడవాలనుకోవడం లేదు.. సైఫ్ షాకింగ్ డిసిషన్
వయోపరిమితి పోస్ట్ ప్రకారం, అభ్యర్థుల కనీస వయస్సు 25 నుండి 40 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 40 నుండి 62 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియ ప్రాథమిక స్క్రీనింగ్/షార్ట్లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఉండదు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 600 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 100 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
చివరి బంతి థ్రిల్లర్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న Krunal Pandya..!
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..