AAP Leader Climbs Tower: టికెట్ ఇవ్వలేదని టవర్ ఎక్కిన ఆప్ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP Leader, Denied Delhi Civic Poll Chance, Climbs Tower: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం ఆప్ తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 250 సభ్యులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీని కోసం ఆప్ శుక్రవారం 134 మందితో, శనివారం 117 మందితో తుది జాబితాను విడుదల చేసింది. అయితే అందులో తన పేరు లేకపోవడంతో ఆప్ నేత టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
Read Also: Gujarat: రైలు లేకపోతే ఓట్లు లేవు.. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన 18 గ్రామాలు
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీకి చెందిన మాజీ కౌన్సిలర్ హసీబ్-ఉల్ హసన్ తనకు టికెట్ రాకపోవడంతో నిరసన తెలుపుతూ.. టవర్ ఎక్కాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆప్ వర్గాల్లో కలకలం రేపింది. టవర్ ఎక్కడమే కాకుండా దాన్ని ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. తనకు టికెట్ రాకపోవడానికి ఆప్ నాయకులు అతిషి, దుర్గేష్ పాఠక్ కారణం అని ఆరోపించారు. తాను చనిపోతే వీరిద్దరిదే బాధ్యత అని చెప్పాడు. ‘‘ ఈ రోజు నాకు ఏదైనా జరిగితే లేదా నేను చనిపోతే ఆప్ నాయకులు దుర్గేష్ పాఠక్, అతిషి బాధ్యత వహిస్తారని అన్నాుడ. నా బ్యాంక్ పాస్ బుక్ తో సహా నా ఒరిజినల్ పత్రాలు వారి వద్ద ఉన్నాయి.. నామిణేషన్ల దాఖలు చేయడానికి రేపు చివరి రోజు కానీ వారు నాపత్రాలను నాకు ఇవ్వడం లేదు’’ అని వీడియో చెప్పాడు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తనను పోటీలో దింపుతుందా.. లేదా.. అన్నది తనకు ఆందోళనగా లేదని.. అయితే తన పత్రాలను తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ ఆరోపణలపై ఆప్ స్పందించలేదు. హసీబ్ ఉల్ హసన్ ఈ ఏడాది ప్రారంభంలో వార్తల్లోకి వచ్చారు. మార్చి నెలలో శాస్త్రి పార్క్ లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. తెల్లని కుర్తాతో డ్రెయిన్ లో నిలబడి చెత్త తీస్తూ నిరసన తెలిపారు.
Delhi |Had media not come Durgesh Pathak,Atishi,Sanjay Singh wouldn't have returned my paper.They sold ticket to Deepu Chaudhary for Rs 3 Cr,demanded money from me but I don't have any: AAP's Haseeb-ul-Hasan who climbed transmission tower allegedly for not getting MCD poll ticket pic.twitter.com/P5ienYKqVc
— ANI (@ANI) November 13, 2022
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!