AAP Leader Climbs Tower: టికెట్ ఇవ్వలేదని టవర్ ఎక్కిన ఆప్ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP Leader, Denied Delhi Civic Poll Chance, Climbs Tower: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల కోసం ఆప్ తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 250 సభ్యులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీని కోసం ఆప్ శుక్రవారం 134 మందితో, శనివారం 117 మందితో తుది జాబితాను విడుదల చేసింది. అయితే అందులో తన పేరు లేకపోవడంతో ఆప్ నేత టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
Read Also: Gujarat: రైలు లేకపోతే ఓట్లు లేవు.. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన 18 గ్రామాలు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
వివరాల్లోకి వెళితే.. తూర్పు ఢిల్లీకి చెందిన మాజీ కౌన్సిలర్ హసీబ్-ఉల్ హసన్ తనకు టికెట్ రాకపోవడంతో నిరసన తెలుపుతూ.. టవర్ ఎక్కాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆప్ వర్గాల్లో కలకలం రేపింది. టవర్ ఎక్కడమే కాకుండా దాన్ని ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. తనకు టికెట్ రాకపోవడానికి ఆప్ నాయకులు అతిషి, దుర్గేష్ పాఠక్ కారణం అని ఆరోపించారు. తాను చనిపోతే వీరిద్దరిదే బాధ్యత అని చెప్పాడు. ‘‘ ఈ రోజు నాకు ఏదైనా జరిగితే లేదా నేను చనిపోతే ఆప్ నాయకులు దుర్గేష్ పాఠక్, అతిషి బాధ్యత వహిస్తారని అన్నాుడ. నా బ్యాంక్ పాస్ బుక్ తో సహా నా ఒరిజినల్ పత్రాలు వారి వద్ద ఉన్నాయి.. నామిణేషన్ల దాఖలు చేయడానికి రేపు చివరి రోజు కానీ వారు నాపత్రాలను నాకు ఇవ్వడం లేదు’’ అని వీడియో చెప్పాడు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తనను పోటీలో దింపుతుందా.. లేదా.. అన్నది తనకు ఆందోళనగా లేదని.. అయితే తన పత్రాలను తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ ఆరోపణలపై ఆప్ స్పందించలేదు. హసీబ్ ఉల్ హసన్ ఈ ఏడాది ప్రారంభంలో వార్తల్లోకి వచ్చారు. మార్చి నెలలో శాస్త్రి పార్క్ లో పొంగిపొర్లుతున్న మురుగు కాలువను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. తెల్లని కుర్తాతో డ్రెయిన్ లో నిలబడి చెత్త తీస్తూ నిరసన తెలిపారు.
Delhi |Had media not come Durgesh Pathak,Atishi,Sanjay Singh wouldn't have returned my paper.They sold ticket to Deepu Chaudhary for Rs 3 Cr,demanded money from me but I don't have any: AAP's Haseeb-ul-Hasan who climbed transmission tower allegedly for not getting MCD poll ticket pic.twitter.com/P5ienYKqVc
— ANI (@ANI) November 13, 2022
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..