Barren Land Into Forest: ఓ వ్యక్తి 20 ఏళ్ల కృషి.. బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Transformed Barren Land Into Forest: పర్యావరణ సమతౌల్యానికి పచ్చదనమే శ్రీరామ రక్ష. ఆధునిక యుగంలో మాత్రం ప్రజలు అసలు ప్రకృతి క్షేమమే పట్టించుకోవడం లేదు. కొంత మంది మాత్రం ప్రకృతే ప్రాణంగా బతుకుతున్నారు. ఇటాంటి వారిలో ఖచ్చితంగా ఉంటారు మణిపూర్ కు చెందిన మొయిరంగ్థేం లోయా. 20 ఏళ్లలో ఓ అటవీనే పెంచారు. 300 ఎకరాల బంజరు భూమిని పచ్చని అడవితో నింపేశాడు. ప్రకృతి ప్రేమికుడు అయిన మొయిరంగ్థెం లోయా తన 20 ఏళ్లలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ జిల్లా ఉరిపోక్ ఖైడెం లైకై ప్రాంతానికి చెందిన మొయిరంగ్థెం లోయా ఇంఫాల్ శివార్లలోని లాంగోల్ హిల్ శ్రేణిలోని 20 ఏళ్ల క్రితం చెట్లను నాటడం ప్రారంభించాడు. ఒకప్పుడు బీడు భూమిగా ఉన్న ఆ ప్రాంతం నేడు పచ్చని చెట్లతో నిండిపోయింది.
Read Also: AAP Leader Climbs Tower: టికెట్ ఇవ్వలేదని టవర్ ఎక్కిన ఆప్ నేత
Also Read
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
2000 సంవత్సరం ప్రారంభంలో చెన్నైలోని ఓ కాలేజీలో విద్య ముగించుకుని సొంత రాష్ట్రం మణిపూర్ కు చేరుకున్నాడు. అయితే కౌబ్రూ పర్వతానికి వెళ్లిన సమయంలో మొయిరంగ్థెం లోయా అక్కడ ఉంటే చెట్లు చాలా వరకు తొలగించబడ్డాయి. విస్తృతంగా సాగుతున్న అటవీ నిర్మూలన చూసిన తర్వాత ఆ విషయం నన్ను భయపెట్టిందన్నారు లోయా. ఆ క్షణమే మళ్లీ చెట్లను పెంచాలని బలంగా కోరుకున్నారు. ఇలా అనుకుంటున్న సమయంలో ఇంఫాల్ శివార్లలోని బంజరుగా ఉన్న ప్రాంతాన్ని అడవిగా మార్చవచ్చని భావించా అని 47 ఏళ్ల మొయిరంగ్థెం లోయా చెప్పారు.
వెదురు, ఓక్, జాక్ ఫ్రూట్ చెట్లతో పాటు టేకు చెట్లను నాటాడు. సాధారణంగా నేను మొక్కలు కొనుగోలు చేసి వాటిని తీరిక సమయాల్లో నాటుతుంటా అని మొయిరంగ్థెం లోయా వెల్లడించారు. వానాకాలం కన్నా ముందే చెట్ల పెంపకం ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. లోయా ప్రయత్నానికి రాష్ట్ర అటవీ శాఖ కూడా మద్దతు తెలిపింది. 300 ఎకరాల్లో 100కు పైగా మొక్కలు, 25 రకాల వెదురు జాతులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతం జింకలు, పాములకు నిలయంగా ఉందని అటవీ అధికారులు వెల్లడించారు. లోయా జీవనోపాధి కోసం ఫార్మసీని నడుపుతున్నారు.
తాజావార్తలు
-
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్..
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!