Barren Land Into Forest: ఓ వ్యక్తి 20 ఏళ్ల కృషి.. బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చింది.
Man Transformed Barren Land Into Forest: పర్యావరణ సమతౌల్యానికి పచ్చదనమే శ్రీరామ రక్ష. ఆధునిక యుగంలో మాత్రం ప్రజలు అసలు ప్రకృతి క్షేమమే పట్టించుకోవడం లేదు. కొంత మంది మాత్రం ప్రకృతే ప్రాణంగా బతుకుతున్నారు. ఇటాంటి వారిలో ఖచ్చితంగా ఉంటారు మణిపూర్ కు చెందిన మొయిరంగ్థేం లోయా. 20 ఏళ్లలో ఓ అటవీనే పెంచారు. 300 ఎకరాల బంజరు భూమిని పచ్చని అడవితో నింపేశాడు. ప్రకృతి ప్రేమికుడు అయిన మొయిరంగ్థెం లోయా తన 20 ఏళ్లలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ జిల్లా ఉరిపోక్ ఖైడెం లైకై ప్రాంతానికి చెందిన మొయిరంగ్థెం లోయా ఇంఫాల్ శివార్లలోని లాంగోల్ హిల్ శ్రేణిలోని 20 ఏళ్ల క్రితం చెట్లను నాటడం ప్రారంభించాడు. ఒకప్పుడు బీడు భూమిగా ఉన్న ఆ ప్రాంతం నేడు పచ్చని చెట్లతో నిండిపోయింది.
Read Also: AAP Leader Climbs Tower: టికెట్ ఇవ్వలేదని టవర్ ఎక్కిన ఆప్ నేత
Also Read
- Rajinikanth: రజినీకాంత్ ఓటు వేస్తుంటే ఈవీఎం వరకు కెమెరాలు.. రికార్డైన 'తలైవా' ఓటు..! అసలేం జరిగింది?
- Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
- Bengal Election: బెంగాల్లోనూ భారీ పోలింగ్.. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు
- Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
2000 సంవత్సరం ప్రారంభంలో చెన్నైలోని ఓ కాలేజీలో విద్య ముగించుకుని సొంత రాష్ట్రం మణిపూర్ కు చేరుకున్నాడు. అయితే కౌబ్రూ పర్వతానికి వెళ్లిన సమయంలో మొయిరంగ్థెం లోయా అక్కడ ఉంటే చెట్లు చాలా వరకు తొలగించబడ్డాయి. విస్తృతంగా సాగుతున్న అటవీ నిర్మూలన చూసిన తర్వాత ఆ విషయం నన్ను భయపెట్టిందన్నారు లోయా. ఆ క్షణమే మళ్లీ చెట్లను పెంచాలని బలంగా కోరుకున్నారు. ఇలా అనుకుంటున్న సమయంలో ఇంఫాల్ శివార్లలోని బంజరుగా ఉన్న ప్రాంతాన్ని అడవిగా మార్చవచ్చని భావించా అని 47 ఏళ్ల మొయిరంగ్థెం లోయా చెప్పారు.
వెదురు, ఓక్, జాక్ ఫ్రూట్ చెట్లతో పాటు టేకు చెట్లను నాటాడు. సాధారణంగా నేను మొక్కలు కొనుగోలు చేసి వాటిని తీరిక సమయాల్లో నాటుతుంటా అని మొయిరంగ్థెం లోయా వెల్లడించారు. వానాకాలం కన్నా ముందే చెట్ల పెంపకం ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. లోయా ప్రయత్నానికి రాష్ట్ర అటవీ శాఖ కూడా మద్దతు తెలిపింది. 300 ఎకరాల్లో 100కు పైగా మొక్కలు, 25 రకాల వెదురు జాతులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతం జింకలు, పాములకు నిలయంగా ఉందని అటవీ అధికారులు వెల్లడించారు. లోయా జీవనోపాధి కోసం ఫార్మసీని నడుపుతున్నారు.
తాజావార్తలు
-
Ravindra Jadeja: అయ్యబాబోయ్.. కాస్త ఉంటే అభిమానులను కొట్టేలాగా ఉన్నాడే.! వీడియో వైరల్
-
Rajinikanth: రజినీకాంత్ ఓటు వేస్తుంటే ఈవీఎం వరకు కెమెరాలు.. రికార్డైన ‘తలైవా’ ఓటు..! అసలేం జరిగింది?
-
Assembly Elections: తమిళనాడు, బెంగాల్లో పోటాపోటీగా పోలింగ్.. ఉ.11 గంటలకు భారీగా ఓటింగ్
-
Venkata Krishnapuram Crime: లీడ్ కనుక్కునేందుకు ఎవ్వరూ ప్రాణాలతో లేరు.. వెంకటకృష్ణపాలెంలో విషాదంపై పుత్తూరు డీఎస్పీ!
-
Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?