Barren Land Into Forest: ఓ వ్యక్తి 20 ఏళ్ల కృషి.. బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Transformed Barren Land Into Forest: పర్యావరణ సమతౌల్యానికి పచ్చదనమే శ్రీరామ రక్ష. ఆధునిక యుగంలో మాత్రం ప్రజలు అసలు ప్రకృతి క్షేమమే పట్టించుకోవడం లేదు. కొంత మంది మాత్రం ప్రకృతే ప్రాణంగా బతుకుతున్నారు. ఇటాంటి వారిలో ఖచ్చితంగా ఉంటారు మణిపూర్ కు చెందిన మొయిరంగ్థేం లోయా. 20 ఏళ్లలో ఓ అటవీనే పెంచారు. 300 ఎకరాల బంజరు భూమిని పచ్చని అడవితో నింపేశాడు. ప్రకృతి ప్రేమికుడు అయిన మొయిరంగ్థెం లోయా తన 20 ఏళ్లలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ జిల్లా ఉరిపోక్ ఖైడెం లైకై ప్రాంతానికి చెందిన మొయిరంగ్థెం లోయా ఇంఫాల్ శివార్లలోని లాంగోల్ హిల్ శ్రేణిలోని 20 ఏళ్ల క్రితం చెట్లను నాటడం ప్రారంభించాడు. ఒకప్పుడు బీడు భూమిగా ఉన్న ఆ ప్రాంతం నేడు పచ్చని చెట్లతో నిండిపోయింది.
Read Also: AAP Leader Climbs Tower: టికెట్ ఇవ్వలేదని టవర్ ఎక్కిన ఆప్ నేత
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
2000 సంవత్సరం ప్రారంభంలో చెన్నైలోని ఓ కాలేజీలో విద్య ముగించుకుని సొంత రాష్ట్రం మణిపూర్ కు చేరుకున్నాడు. అయితే కౌబ్రూ పర్వతానికి వెళ్లిన సమయంలో మొయిరంగ్థెం లోయా అక్కడ ఉంటే చెట్లు చాలా వరకు తొలగించబడ్డాయి. విస్తృతంగా సాగుతున్న అటవీ నిర్మూలన చూసిన తర్వాత ఆ విషయం నన్ను భయపెట్టిందన్నారు లోయా. ఆ క్షణమే మళ్లీ చెట్లను పెంచాలని బలంగా కోరుకున్నారు. ఇలా అనుకుంటున్న సమయంలో ఇంఫాల్ శివార్లలోని బంజరుగా ఉన్న ప్రాంతాన్ని అడవిగా మార్చవచ్చని భావించా అని 47 ఏళ్ల మొయిరంగ్థెం లోయా చెప్పారు.
వెదురు, ఓక్, జాక్ ఫ్రూట్ చెట్లతో పాటు టేకు చెట్లను నాటాడు. సాధారణంగా నేను మొక్కలు కొనుగోలు చేసి వాటిని తీరిక సమయాల్లో నాటుతుంటా అని మొయిరంగ్థెం లోయా వెల్లడించారు. వానాకాలం కన్నా ముందే చెట్ల పెంపకం ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. లోయా ప్రయత్నానికి రాష్ట్ర అటవీ శాఖ కూడా మద్దతు తెలిపింది. 300 ఎకరాల్లో 100కు పైగా మొక్కలు, 25 రకాల వెదురు జాతులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతం జింకలు, పాములకు నిలయంగా ఉందని అటవీ అధికారులు వెల్లడించారు. లోయా జీవనోపాధి కోసం ఫార్మసీని నడుపుతున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!