Rajiv Gandhi Assassination Case: జైలు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హంతకులు.. తమిళులకు థాంక్స్ తెలిపిన నళిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajiv Gandhi Assassination convicts leaves jail: సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న నళిని శ్రీహరన్ తో పాటు మరో ఐదుగురు తమిళనాడు వేల్లూరు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. నళినితో పాటు శ్రీహరన్, సంతన్, మురుగన్, రాబర్ట్ పాయస్, ఆర్పీ రవిచంద్రన్ విడుదలైన వారిలో ఉన్నారు. 31 ఏళ్ల పాటు నిందితులు జైలు శిక్ష అనుభవించారు. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పుతో వీరందరికి ఊరట లభించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
1991 రాజీవ్ గాంధీ హత్య తరువాత 31 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆరుగురు జీవిత ఖదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన మరుసటి రోజు వారందరిని అధికారులు శనివారం సాయంత్ర తమిళనాడు జైలు నుంచి విడుదల చేశారు. మే నెలలో ఏడుగురు దోషుల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ ను సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి విడుదల చేసింది. ఇదే ఉత్తర్వును కూడా మిగతా వారికి వర్తింపచేస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. దోషులను విడుదల చేయాలని తమిళనాడు మంత్రి వర్గం 2018లో గవర్నర్ కు సిఫారసు చేసిందని..అందుకు గవర్నర్ కూడా కట్టుబడి ఉన్నారని పేర్కొంది.
Also Read
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
- West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Read Also: Mass layoffs: మెటా దారిలో మరో కంపెనీ.. ఉద్యోగులను తొలగించే పనిలో స్ట్రీమింగ్ దిగ్గజం..!
ఇప్పటికే పెరోల్ పై ఉన్న నళిని స్థానిక పోలీస్ స్టేషన్ ప్రతీ రోజూ తప్పనిసరిగా హాజరు అవుతుంది. అక్కడి నుంచి వెల్లూరు లోని మహిళా జైలుకు వెళ్లి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత మిగతా దోషులు విడుదల అవుతన్న సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్కడ నుంచి అందరు జైలు నుంచి విడుదల అయ్యారు. దోషుల్లో మురుగన్, శాంతన్ ఇద్దరూ శ్రీలంక జాతీయులు కావడంతో పోలీసులు ప్రత్యేక వాహనంలో వారిద్దరిని తిరుచిరాపల్లిలోని శరణార్థి శిబిరానికి తీసుకెళ్లారు. అయితే దోషుల్లో సంతన్ తన సొంతదేశం శ్రీలంక వెళ్లాలని అనుకుంటున్నాడు. మరోవైపు నళిని తమిళనాడులో ఉంటుందా..? లేక తన కుమార్తె ఉన్న లండన్ వెళ్తుందా అనేది ఇంకా తెలియరాలేదు.
ఇదిలా ఉంటే 32 ఏళ్లుగా తనకు మద్దతు ఇస్తున్న తమిళులకు నళిని థాంక్స్ చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. మిగతా విషయాల గురించి రేపు చెన్నైలో ప్రెస్ మీట్ లో మాట్లాడతా అని వెల్లడించారు. 1991 మే 21, ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు తమిళనాడులోని శ్రీపెరంబుదూరు రాజీవ్ గాంధీ వచ్చిన క్రమంలో తమిళ్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) వేర్పాటువాదులు ఆత్మాహుతిలో హత్య చేశారు.
తాజావార్తలు
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!