Union minister Pralhad Joshi: టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఎవరు నిర్మించినా ఇంటికి పంపిస్తాం.. కేంద్రమంత్రి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whoever builds Tipu Sultan’s statue will be sent home, BJP minister’s warning: కర్ణాటక మైసూరులో 100 అడుగుల పొడవైన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నిర్మించకోనివ్వండి.. వారికి ఎవరు మద్దతు ఇచ్చినా.. టిప్పు విగ్రహాలను నిర్మించినా ప్రజలు వారిని ఇంటికి పంపిస్తారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
Read Also: Warangal Crime: మద్యం మత్తులో కన్నకూతురిపై అఘాయిత్యం.. మనిషేనా..?
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
మైసూరు లేదా శ్రీరంగపట్నంలో 100 అడుగుల టిప్పు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని.. ఇది తన చుట్టూ ఉన్న వాస్తవ చరిత్రకు ప్రతీకగా నిలుస్తుందని నరసింహరాజ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సైత్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ చుట్టూ ఉన్న చరిత్రను వక్రీకరిస్తోందని.. టిప్పు వారసత్వాన్ని తొగించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అందుకనే విగ్రహాన్ని తక్షణమే నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ధార్వాడ్ లో టిప్పు జయంతిని జరుపుకోవాలన్న కర్ణాటక పౌరసంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ నిరసన ర్యాలీకి ప్లాన్ చేసింది. దీంతో పోలీసులు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది జరిగిన తర్వాత కేంద్ర మంత్రి జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా కడప మైదాన్ గ్రౌండ్స్ కు బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య యోధుల చరిత్రను బీజేపీ వక్రీకరించే పనిలో ఉందని విమర్శించారు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేరు..? ఆయనకు విగ్రహం పెట్టే అర్హత లేదా..? అని ప్రశ్నించారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని ఆయన సిద్ధరామయ్య అన్నారు. గతంలో ఈద్గా మైదాన్ లో గణేష్ ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఎంఐఎం టిప్పు జయంతి కోసం ఎంఐఎం అనుమతి కోరింది. దీనికి కర్ణాటక పౌరసంఘం అనుమతించింది.
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!