Gold Smuggling: ముంబై విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం.. బెల్టులో అమర్చి తరలించే యత్నం
Gold Smuggling at Mumbai airport: విదేశాల నుంచి బంగారం, డ్రగ్స్ అక్రమ రవాణా ఆగడం లేదు. విమానాశ్రయాలే కేంద్రంగా ఇప్పటికే చాలా మంది నిందితులు పట్టుబడ్డారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రూ.32 కోట్ల విలువైన 61 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. విదేశాల నుంచి ముంబాయికి చేరుకున్న ఏడుగురు ప్రయాణికులు వద్ద బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు కస్టమ్స్ అధికారు. అధికారుల కళ్లుగప్పి గోల్డ్ బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది స్మగ్లింగ్ ముఠా.
Read Also: Barren Land Into Forest: ఓ వ్యక్తి 20 ఏళ్ల కృషి.. బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చింది.
Also Read
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
పథకం ప్రకారం 61 కేజీల బరువు ఉన్న బిస్కట్లను 7 భాగాలుగా చేసి నడుము బెల్టులో దాచి తరలించే యత్నం చేశారు. దీని కోసం స్పెషల్ గా అరబ్ కంట్రీలో నడుము బెల్లులను తయారు చేయించారు కేటుగాళ్లు. అయితే ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు దృష్టి మరల్చేందుకు కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగింది స్మగ్లర్స్ గ్యాంగ్. అయితే చాకచక్యంగా వ్యవహరించిన కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఆఫ్రికా దేశం టాంజానియా నుంచి దోహా మీదుగా ముంబైకి వచ్చారు స్మగ్లర్లు. దోహా ఎయిర్ పోర్టులో బంగారు బిస్కట్లతో ఉన్న నడుము బెల్టును సూడాన్ జాతీయుడు స్మగ్లర్లకు అప్పగించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. గోల్డ్ ను ముంబాయిలోని ఎవరికి ఇవ్వడానికి తీసుకువచ్చారు..? అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడ్డ స్మగ్లర్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ముంబాయి ఎయిర్ పోర్టులో ఇంతపెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
-
Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!