Meta layoff.. Indians suffering: వరసగా టెక్ దిగ్గజాలు ఉద్యోగులకు షాక్ ల ఇస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, నెటిఫ్లిక్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా కూడా చేరింది. ఏకంగా 13 శాతం అంటే 11,000 ఉద్యోగులను తీసేస్తున్నట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సంస్థలో పనిచేస్తున్న పలువురు భారతీయులు ఉద్యోగాలు కూడా ఊడాయి. దీంతో ఉద్యోగులు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
If two women want to live together they can says Madhya Pradesh High Court: మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఇద్దరు మహిళలు కలిసి ఉంటున్న కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు మహిళలు తమ ఇష్టానుసారం కలిసి జీవించాలనుకుంటే.. వారిని కోర్టు అడ్డుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తన కూతురును తనకు అప్పగించాలని కోరుతూ.. 18 ఏళ్ల యువతి తండ్రి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం విచారించింది. 18 ఏళ్ల అమ్మాయి,…
Woman In UP Allegedly Raped By Husband, Brother-In-Law After 'Triple Talaq': ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు అత్యాచారానికి పాల్పడ్డారు. ట్రిపుల్ తలాక్ పేరుతో మహిళను మోసం చేశారు. సదరు మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో మతగురువుతో పాటు పలువురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని…
Tamil Nadu Rains.. floods in chennai: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవితం స్తంభిస్తోంది. ముఖ్యంగా రాజధాని చెన్నైలో శుక్రవారం రోజు భారీగా వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వరద గుప్పిట చెన్నై ఉంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Rajiv Gandhi assassination case: దేశ చరిత్రను, దేశ రాజకీయాలు ప్రభావితం చేసిన ఘటనల్లో ముఖ్యమైంది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతం. తాజాగా శుక్రవారం ఈ కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. శుక్రవారం రోజు ఆరుగురు దోషులు నళిని, పిఆర్ రవిచంద్రన్, రాబర్ట్ పియాస్, సుతేంద్రరాజా, జయకుమార్, శ్రీహరన్ విడుదలయ్యారు.
Aaditya Thackeray Joins Bharat Jodo Yatra, Marches With Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్రం ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రస్తుతం జోడో యాత్ర మహారాష్ట్రకు చేరింది. యాత్ర ప్రారంభమై 65వ రోజుకు చేరుకుంది. ఇదిలా ఉంటే శుక్రవారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గ నేత, మాజీ…
Congress angry over the release of convicts in the Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులుగా ఉన్న నళిని, మరో ఐదుగురు వ్యక్తులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 1991 మే21న తమిళనాడు శ్రీపెరంబుదూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ వెళ్లిన సందర్భంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) ఉగ్రవాదులు ఆత్మహుతికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాజీవ్…
Actor Jacqueline Fernandez's Pre-Arrest Bail Extended Till Tuesday: బాలీవుడ్ యాక్టర్ జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ ప్రి అరెస్ట్ బెయిల్ను మంగళవారం వరకు పొడగించింది ఢిల్లీ కోర్టు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు కూడా ప్రమేయం ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో గతంలో జాక్వెలిన్ కు ఢిల్లీ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే దీన్ని మంగళవారం వరకు పొడగించింది…
More than half of the candidates in the Himachal elections are millionaires: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు అంతా సిద్ధం అయింది. నవంబర్ 12 అంటే రేపే హిమాలయ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. బీజేపీ అధికారంలోకి రావాలని మరోసారి అనుకుంటోంది. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీని గద్దె దించాలని పట్టుదలతో ఉంది. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఆస్తులు హాట్ టాపిక్ అయ్యాయి. అన్ని పార్టీలను కలుపుకుంటే దాదాపుగా సగాని కన్నా ఎక్కువ మంది కోటీశ్వరులే పోటీలో…
Gyanvapi 'Shivling' to be protected until further orders Says Supreme Court: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ వివాదంపై కీలక ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గతంలో తాము ఇచ్చిన రక్షణ ఆదేశాలను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో మసీదు వీడియో సర్వేలో భాగంగా వాజూఖానాలోని ఓ కొలనులో ‘శివలింగం’ వంటి ఆకారాన్ని కనుక్కున్నారు. అప్పటి నుంచీ ఈ…