Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pakistan: అంధకారంలో కరాచీ నగరం.. 40 శాతం నగరానికి పవర్ కట్..
Pakistan: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మరిన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇటీవల ట్రాన్స్మిషన్ లైన్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ రాజధానితో పాటు ప్రధాన నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఒక రోజు పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తాజాగా మరోసారి పాక్ విద్యుత్ వ్యవస్థ వైఫల్యం చెందింది. పాక్ వాణిజ్య నగరం, అతిపెద్ద నగరం అయిన కరాచీ తీవ్ర విద్యుత్ సమస్యలతో సతమతం అవుతోంది. -
H3N2 Virus: హెచ్3ఎన్2 వైరస్తో మరొకరు మృతి.. 7కు చేరిన మరణాల సంఖ్య
H3N2 Virus: దేశంలో హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఓ మహిళ మరణించింది. దీంతో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7కు చేరుకుంది. జనవరి 1 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగా మరణించింది. గత వారం కర్ణాటక, హర్యానాల్లో ఇద్ధరు మరణించారు. దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలోని హసన్… -
Congress: మోదీజీ.. ఆస్కార్ అవార్డుల ఘనత మీదని చెప్పుకోవద్దు..
Congress: కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బీజేపీపై వంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘‘ నాటు నాటు’’ పాటకు ‘‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్’’ డాక్యుమెంటరీలకు ఆస్కార్ అవార్డులు రావడాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మేము చాలా గర్వంగా ఉన్నాము.. అయితే నా ఏకైక అభ్యర్థన ఏంటంటే బీజేపీ ఈ అవార్డులు తన ఘనత అని చెప్పుకోవద్దని ఖర్గే అన్నారు. -
Russia-Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతే.. పుతిన్ గద్దె దిగాల్సిందే..
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. బఖ్ ముత్ పట్టణంపై ఆధిపత్యం కోసం రష్యా తీవ్రదాడులు చేస్తోంది. ఒకవేళ ఈ పట్టణం రష్యా వశం అయితే ఇక ఉక్రెయిన్ కు లొంగిపోవడమే దిక్కు. రష్యన్ బలగాలు సునాయసంగా తూర్పు ప్రాంతాలపై ఆధిపత్యం కనబడిచే అవకాశం ఉంది. దీంతోనే బక్ ముఖ్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు పోరుగుతున్నాయి. -
Man Kills Wife: డ్రెస్సు సరిగా వేసుకోలేదని భార్యను చంపిన భర్త
Man Kills Wife: పబ్లిక్ ప్లేసుకు అనుచితంగా డ్రెస్ వేసుకుని వచ్చినందుకు భర్త, భార్యను హతమార్చాడు. ఎన్నిసార్లు చెప్పిన పట్టించకోవడం లేదని కోపంతో భార్యను చంపానని నిందితుడు వెల్లడించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగింది. చిన్నపాటి గొడవ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదంగా మారి భార్య హత్యకు దారి తీసింది. -
Adani Son Engagement: గౌతమ్ అదానీ కొడుకు ఎంగేజ్మెంట్.. వధువు ఎవరంటే..
Gautam Adani's son Jeet Adani gets engaged to Diva Jaimin Shah: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ ఎంగేజ్మెంట్ దివా జైమిన్ షాతో ఆదివారం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగి ఈ నిశ్చితార్థానికి కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వధువు దివా ప్రముఖ వజ్రాల వ్యాపారి సి.దినేష్ & కో. ప్రైవేట్ లిమిటెడ్ యజమాని జైమిన్ షా కుమార్తె. ఈ కంపెనీ ముంబాయి, సూరత్ ప్రాంతాల్లో… -
RSS: రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి..
RSS: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల పదేపదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆర్ఎస్ఎస్ వాస్తవికతను చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేమ హోసబాలే అన్నారు. స్వలింగ వివాహాలపై కేంద్రం దృష్టితో తాము ఏకీభవిస్తున్నామని, ఆడ, మగ వారి మధ్యే వివాహం జరుగుతుందని హోసబాలే అన్నారు. -
India On Pakistan: మళ్లీ కాశ్మీర్ ప్రస్తావన.. పాక్ “టెర్రరిస్టుల ఎగుమతిదారు” అంటూ భారత్ ఆగ్రహం
India On Pakistan: పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. వేదిక ఏదైనా, ఎజెండా ఏమైనా అవేవీ పట్టించుకోకుండా అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, భారత్ ను అబాసుపాటు చేయాలని భావిస్తోంది. తాజాగా బహ్రెయిన్ లో సోమవారం 146వ ఇంటరం పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అసెంబ్లీ సోమవారం భారత్, పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీయూలో కూడా పాక్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్ ను ‘‘ఉగ్రవాద ఎగుమతిదారు’’ విమర్శించింది. -
Pre-Installed Apps: మొబైల్స్లో ప్రీ ఇన్స్టాల్ యాప్లపై కేంద్రం ఉక్కుపాదం..?
Pre-Installed Apps: స్మార్ట్ ఫోన్ల విషయంలో కేంద్రం కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. స్మార్ట్ ఫోన్లలో ముందగానే ఇన్ బిల్ట్ గా ఉంటున్న ప్రీ ఇన్స్టాల్ యాప్లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా పరంగా సమస్యలు తలెత్తె అవకాశం ఉండటంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గూఢచర్యం, యూజర్ డేటా దుర్వినియోగం గురించి ఆందోళన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది. -
Public Swimming Pool: ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.. ఇక టాప్ లేపేయండి
Topless At Public Swimming: లింగవివక్షతను రూపుమాపేందుకు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలోని అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు కూడా టాప్లెస్గా పబ్లిక్ స్విమ్మింగ్ ఫూల్స్ లోని ప్రవేశించడాన్ని అనుమతించింది. దీంతో ఇకపై మగవారు, ఆడవారు టాప్లెస్గా స్విమ్మింగ్ ఫూల్స్ లో ఈత కొట్టవచ్చన్నమాట. మహిళ వివక్షపై ఓ మహిళ ఫిర్యాదు ఇవ్వడంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!