Border violence: నివురుగప్పిన నిప్పులా అస్సాం-మేఘాలయ సరిహద్దు.. శాంతి చర్చలకు ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peace talks between Assam-Meghalaya: అస్సాం- మేఘాలయ సరిహద్దుల్లో భారీగా హింస జరగడంతో అస్సాం ఫారెస్ట్ గార్డుతో సహా మొత్తం ఆరుగురు మరణించారు. కలప స్మగ్లింగ్ వివాదం రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు హింసకు దారి తీసింది. ప్రస్తుతం పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు సమీపంలో ఉన్న మేఘాలయ, అస్సాం సరిహద్దు గ్రామం అయిన ఉమ్లాపర్ వద్ద అస్సాం పోలీసులు నిఘాపెంచారు. ఇదిలా ఉంటే అస్సాం పెట్రోలియం కార్మికులు మేఘాలయకు ఇంధన రవాణా నిలిపివేస్తునట్లు ప్రకటించారు. అస్సాం పెట్రోలియం మజ్దూర్ యూనియన్ అన్ని చమురు కంపెనీలకు లేఖలు రాసింది. ట్యాంకర్లలో ఇంధనం లోడ్ చేయకూడదని కోరింది.
Read Also: BJP vs BJP: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం.. బీజేపీ వర్సెస్ బీజేపీగా మారిన అంశం
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
అస్సాం నెంబర్ ప్లేట్ తో మేఘాలయకు వెళ్తున్న వాహనాలపై దాడులు జరుగుతున్నట్లు చెబుతూ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ చెలరేగిన క్రమంలో మా డ్రైవర్లు దాడులకు గురయ్యారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అస్సాం నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు మేఘాలయ కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని అస్సాం పోలీసులు సూచించారు. మంగళవారం అస్సాం-మేఘాలయ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో అక్రమంగా నరికివేసిన కలపతో వెళ్తున్న ట్రక్కును అస్సాం అటవీ సిబ్బంది అడ్డుకోవడంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు చనిపోయారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మాతో గంటపాటు చర్చించారు. పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని ముక్రోహ్ ప్రాంతంలో జరిగిన కాల్పులపై సీబీఐ విచారిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడేందుకు మేఘాలయ ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్ పై సస్పెన్షన్ విధించింది. ఏడు జిల్లాల్లో 48 గంటల పాటు సస్పెన్షన్ కొనసాగనుంది. ఈ ఘర్షణలు సద్దుమణిగేలా కేంద్ర చొరవ చూపాలని ఇరు రాష్ట్రాలు కోరుతున్నాయి.
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!