Border violence: నివురుగప్పిన నిప్పులా అస్సాం-మేఘాలయ సరిహద్దు.. శాంతి చర్చలకు ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peace talks between Assam-Meghalaya: అస్సాం- మేఘాలయ సరిహద్దుల్లో భారీగా హింస జరగడంతో అస్సాం ఫారెస్ట్ గార్డుతో సహా మొత్తం ఆరుగురు మరణించారు. కలప స్మగ్లింగ్ వివాదం రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు హింసకు దారి తీసింది. ప్రస్తుతం పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాకు సమీపంలో ఉన్న మేఘాలయ, అస్సాం సరిహద్దు గ్రామం అయిన ఉమ్లాపర్ వద్ద అస్సాం పోలీసులు నిఘాపెంచారు. ఇదిలా ఉంటే అస్సాం పెట్రోలియం కార్మికులు మేఘాలయకు ఇంధన రవాణా నిలిపివేస్తునట్లు ప్రకటించారు. అస్సాం పెట్రోలియం మజ్దూర్ యూనియన్ అన్ని చమురు కంపెనీలకు లేఖలు రాసింది. ట్యాంకర్లలో ఇంధనం లోడ్ చేయకూడదని కోరింది.
Read Also: BJP vs BJP: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం.. బీజేపీ వర్సెస్ బీజేపీగా మారిన అంశం
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
అస్సాం నెంబర్ ప్లేట్ తో మేఘాలయకు వెళ్తున్న వాహనాలపై దాడులు జరుగుతున్నట్లు చెబుతూ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ చెలరేగిన క్రమంలో మా డ్రైవర్లు దాడులకు గురయ్యారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అస్సాం నెంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు మేఘాలయ కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని అస్సాం పోలీసులు సూచించారు. మంగళవారం అస్సాం-మేఘాలయ సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలో అక్రమంగా నరికివేసిన కలపతో వెళ్తున్న ట్రక్కును అస్సాం అటవీ సిబ్బంది అడ్డుకోవడంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు చనిపోయారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మాతో గంటపాటు చర్చించారు. పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని ముక్రోహ్ ప్రాంతంలో జరిగిన కాల్పులపై సీబీఐ విచారిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. శాంతి భద్రతలను కాపాడేందుకు మేఘాలయ ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్ పై సస్పెన్షన్ విధించింది. ఏడు జిల్లాల్లో 48 గంటల పాటు సస్పెన్షన్ కొనసాగనుంది. ఈ ఘర్షణలు సద్దుమణిగేలా కేంద్ర చొరవ చూపాలని ఇరు రాష్ట్రాలు కోరుతున్నాయి.
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!