Amit Shah: చరిత్రను తిరిగరాయండి.. మిమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“Who Stops Us From Correcting ‘Distortions’ In History Now?” Amit Shah: భారత చరిత్రను తిరగరాయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చరిత్రకారులను కోరారు. వారి చేసే ప్రయత్నాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. నేను చరిత్ర విద్యార్థిని అని.. చరిత్రను సరిగ్గా రాయలేదని, వక్రీకరించబడిందని నేను చాలా సార్లు విన్నానని.. బహుశా అదే నిజం కావచ్చు అని.. దీన్ని మనం సరిదిద్దాలని కోరారు. అస్సాంకు చెందిన 17వ శతాబ్ధపు అహెమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జన్మదిన కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Bengaluru Crime: ప్రియురాలితో శృంగారం చేస్తూ వ్యాపారవేత్త మృతి..
Also Read
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
చరిత్రను సక్రమంగా, అద్భుత రీతిలో రాయకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారని ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న చరిత్రను పక్కన పెట్టి.. 150 ఏళ్లు పాలించిన 30 రాజవంశాలు, 300 మంది స్వాతంత్య్ర సమరయోధుల గురించి పరిశోధన చేయాల్సిందిగా విద్యార్థులను, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లను కోరారు. ఒక్కసారి నిజాలు రాస్తే తప్పుడు చరిత్ర అంతా కనుమరుగు అవుతుందని ఆయన అన్నారు. చరిత్రకారులకు కేంద్రం మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ప్రజల ప్రయోజనం కోసం చరిత్రను పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. మొఘలుల విస్తరణను అడ్డుకున్న లచిత్ పోరాటాన్ని అమిత్ షా కొనియాడారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సరిఘాట్ యుద్ధంలో మొఘలులను ఓడించారని అమిత్ షా అన్నారు.
ఈ సందర్భంగా లచిత్ పై రూపొందించిన డాక్యుమెంటరీని అమిత్ షా ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్ల నేడు ఈశాన్య రాష్ట్రాలు, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలపై అంతరం తగ్గిందని అన్నారు. ప్రభుత్వ కృషి వల్లే ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొందని అమిత్ షా అన్నారు. లచిత్ బర్ఫుకాన్ పుస్తకాన్ని కనీసం 10 భాషల్లోకి అనువదించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అమిత్ షాని కోరారు. లచిత్ పరాక్రమం దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!