Malaysia: మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. ఐదేళ్ల వ్యవధిలో ఐదో ప్రధాని
Anwar Ibrahim sworn in as Malaysia’s PM: మలేషియా ప్రధానిగా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం ఎన్నికయ్యారు. మలేషియా రాజు అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై కొద్ది రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడినట్లు అయింది. శనివారం వెలువడిన సాధారణ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ లభించలేదు. అయితే యునైటెడ్ మలేషియన్ నేషనల్ ఆర్గనైజేషన్ తో పొత్తు పెట్టుకున్న అన్వర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా హంగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Read Also: 26/11 Mumbai attacks: ఉగ్రవాదులపై చర్యలను అడ్డుకుంటున్నారు.. యూఎన్ వేదికగా చైనాపై పరోక్ష వ్యాఖ్యలు
Also Read
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
మలేషియాకు పదో ప్రధానిగా అన్వర్ ఎన్నికయ్యారు. అయితే ఇది గత ఐదేళ్లలో ప్రధానిని ఎన్నుకోవడం ఐదోసారి. అన్వర్ ఇబ్రహీం ఎన్నిక కావడంతో మలేషియన్ మార్కెట్లు పుంజుకున్నాయి. అన్వర్ ఇబ్రహీం తన క్యాబినెట్ కూర్పుపై శుక్రవారం చర్చించాలని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో మలేషియా ఉంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలే అన్వర్ ఇబ్రహీంకు సవాల్ గా మారనున్నాయి. సుపరిపాలను, అవినీతి నిర్మూలన, న్యాయం స్వాతంత్య్రం, మలేషియన్ల సంక్షేమలో ఎప్పటీకీ రాజీపడబోమని కొత్త ప్రధాని గురువారం ప్రకటించారు.
3.3 కోట్ల జనాభా ఉన్న మలేషియాలో మలాయ్ జాతి, భారత్-చైనీ మైనారిటీల మధ్య చారిత్రాత్మక ఉద్రిక్తతలు ఉన్నాయి. అన్వర్ ప్రభుత్వం వీటిని రూపుమాపుతుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. శనివారం జరిగి ఎన్నికల ఫలితాల్లో అన్వర్ కు చెందిన పకటాన్ హరపాన్ సంకీర్ణం 82 స్థానాలు సాధించగా.. ముహిద్దీన్ పెరికటన్ నేషనల్ బ్లాక్ 73 స్థానాలను గెలుచుకుంది. బారిసన్ కూటమి 30 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు 112 మంది అవసరం అయితే ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాలేదు. బారిసన్ కూటమి తమకు మద్దతు ఇస్తుందని అన్వర్ చెప్పారు. దీంతో ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహించారు.
తాజావార్తలు
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో