Venu Goapl Reddy
Author- NTV Telugu-
Smriti Irani: రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్.. దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Smriti Irani Slams Rahul Gandhi: ఇటీవల లండన్ వేదికగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. విదేశీ గడ్డపై భారతదేశ పరువు తీశారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి సంస్థలను ఆయన అగౌరపరిచారని అన్నారు. భారతదేశాన్ని అవమానించడం ప్రజాస్వామ్యామా..? సభాపతిని అగౌరపరచడం ప్రజాస్వామ్యామా.? అని ఆమె రాహుల్ గాంధీని ప్రశ్నించారు. వెంటనే రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
Student Suicide: మార్కులు తక్కువగా వస్తున్నాయని విద్యార్థిని ఆత్మహత్య.. 24 గంటల్లో రెండో ఘటన
Student Suicide: రాజస్థాన్ కోటాలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని మరణించింది. తక్కువ మార్కులు వస్తున్నాయన్న మనస్తాపంలోనే తమ కుమార్తె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
Boy Fell In Borewell: రెస్క్యూ ప్రయత్నాలు విఫలం.. బోరుబావిలో పడిన పిల్లాడి మృతి
Boy Fell In Borewell: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బోరు బావిలో పడిన పిల్లాడి ఘటనలో విషాదం చోటు చేసుకుంది. ఏడేళ్ల పిల్లాడిని రక్షించేందుకు అధికారులు శతవిధాల ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. 24 గంటల తర్వాత పిల్లాడిని బయటకు తీసినా అప్పటికే చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివారాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ విదిషా జిల్లాలో ఏడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని బయటకు తీసేందుకు జిల్లా కలెక్టర్ శంకర్ భార్గవ తో పాటు పోలీస్, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. -
Rahul Gandhi: కర్ణాటక ఎలక్షన్స్.. ఈ నెల 20న రాహుల్ గాంధీ పర్యటన
Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కర్ణాటకకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో ఇరు పార్టీలు పోటాపోటీగా ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాదిలో ఆరుసార్లు కర్ణాటకలో పర్యటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా కర్ణాటకలో పర్యటించారు. -
IIT Student Suicide: ఐఐటీ మద్రాస్ విద్యార్థి ఆత్మహత్య.. నెల వ్యవధిలో రెండో ఘటన..
IIT Student Suicide: ఐఐటీ విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఐఐటీ మద్రాస్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల పుష్పక్ అనే విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. తన మరణంపై విచారణ చేయవద్దని సూసైట్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
Ozone Hole: ఆస్ట్రేలియా కార్చిచ్చు కారణంగా పెరిగిన ఓజోన్ హోల్..
Ozone Hole: 2019-20 ఆస్ట్రేలియాలో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఓజోన్ పొర రంధ్రం విస్తరించినట్లు తాజా అధ్యయాల్లో తేలింది. ఆగ్నేయాస్ట్రేలియాలో దాదాపుగా నెల రోజల పాటు కార్చిచ్చు ఏర్పడింది. వేల హెక్టార్లలో అడవులు ధ్వంసం అయ్యాయి. ఈ భారీ కార్చిచ్చు విడుదలైన వాయువులు ఓజోన్ పొర పలుచగా మారేందుకు కారణం అయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి వరకు ఈ కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది. -
Meta Layoffs: ఐటీ ఉద్యోగులకు షాక్.. మరో 10,000 మందిని తొలగిస్తూ మెటా నిర్ణయం..
Meta Layoffs: టెక్ కంపెనీలో లేఆఫ్స్ ఆగడం లేదు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను వరసగా తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ప్రకారం 2022 ప్రారంభం నుంచి 2,80,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో 40 శాతం మంది ఈ ఏడాదిలోనే ఉద్యోగాలను కోల్పోయారు. -
Donald Trump: మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపే సత్తా నాకే ఉంది.. పుతిన్ నా మాట వింటాడు..
Donald Trump: అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ నుంచి ఆయన జూనియర్ నిక్కీ హేలి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్దం ఆపేసత్తా నాకే ఉందని ఆయన అన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ రష్యాను చైనా చేతుల్లో పెట్టారని విమర్శించారు. -
Umesh Pal Case: హత్య కేసులో మరో నిందితుడిని ఎన్కౌంటర్లో లేపేసిన యోగీ సర్కార్..
Umesh Pal Case: ఉత్తర్ ప్రదేశ్ లో ఉమేష్ పాల్ హత్య కేసులో ఎన్ కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఒక నిందితుడు ఎన్ కౌంటర్ లో చనిపోగా.. తాజాగా మరో నిందితుడు విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ ఎన్ కౌంటర్లో హతం అయ్యాడు. ఈ ఎన్కౌంటర్లో విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ మెడ, ఛాతీ, తొడపై బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.కౌంధియారా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోతి, బెల్వా మధ్య ఉదయం 5.30 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని ధూమంగంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్… -
Ukraine War: రష్యా సైనికుల అకృత్యాలు.. నాలుగేళ్ల చిన్నారిపై దారుణం..తల్లిపై సామూహిక అత్యాచారం..
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొందరు రష్యా సైనికులు చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలు బయటకు వస్తున్నాయి. గతేడాది ఇద్దరు రష్యన్ సైనికులు నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని, చిన్నారి తల్లికి తుపాకీ గురిపెట్టి, భర్త ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూషన్ ఫైల్స్ ప్రకారం 2022 మార్చినెలలో రాజధాని కీవ్ కు సమీపంలో బ్రోవరీ జిల్లాల్లో 4 ఇళ్లల్లోకి చొరబడి రష్యా 15వ స్పెషల్ మోటరైజ్డ్ రైఫిల్ బ్రిగేడ్ కు చెందిన రష్యన్ సైనికులు లైంగిక నేరాలకు పాల్పడినట్లు…
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!