Venu Goapl Reddy
Author- NTV Telugu-
CM Yogi: అసద్ ఎన్కౌంటర్.. వైరల్ అవుతున్న సీఎం యోగి “మట్టిలో కలిపేస్తా” కామెంట్స్..
Yogi Adityanath: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు ఎన్కౌంటర్లో హతమైన తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాత వ్యాఖ్య మళ్లీ ట్రెండ్ అవుతోంది. యూపీ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన హెచ్చరికలు మరోసారి నిజం అయ్యాయి. తాజాగా ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం కరడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్, మరో నిందితుడు గులాంలను ఝాన్సీ సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో చంపేశారు. యూపీ ఎస్టీఎఫ్ టీం, నిందితులకు మధ్య దాదాపుగా 40 రౌండ్లకు పైగా… -
Akhilesh Yadav: అసద్ అహ్మద్ది బూటకపు ఎన్కౌంటర్.. బీజేపీకి కోర్టులపై నమ్మకం లేదు..
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. 2005 బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను గత ఫిబ్రవరిలో చంపేశారు. ఈ కేసులో అతీక్ అహ్మద్ కొడుక అసద్ అహ్మద్, అతని అనుచరుడు గులాం కీలక నిందితులుగా ఉన్నారు. -
Atiq Ahmed: కొడుకు ఎన్కౌంటర్తో ప్రాణం విలువ తెలిసినట్లుంది.. కోర్టులోనే గుక్కపెట్టి ఏడ్చిన అతీక్ అహ్మద్
Atiq Ahmed: 100కు పైగా నేరాాలు, అనేక హత్యలు, బెదిరింపులు ఇలా ఓ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ నేర సామ్రాజ్యాన్ని, రాజకీయాలను శాసించిన గ్యాంగ్ స్టర్ కం పొలిటీషియన్ అతీక్ అహ్మద్ కు ప్రాణ భయాన్ని చూపిస్తున్నారు సీఎం యోగీ ఆదిత్యనాథ్. చివరకు జైలు నుంచి భయటకు వస్తే ఎక్కడ ఎన్కౌంటర్లో హతమవుతానో అని భయపడుతున్నాడు. యూపీకి వెళ్లాలంటేనే భయపడి చస్తున్నాడు. తాజాగా ఈ రోజు అతని కొడుకు అసద్ అహ్మద్ ఎన్ కౌంటర్ లో హతం అయ్యాడు. -
Yogi Adityanath: అతిక్ అహ్మద్ కొడుకు ఎన్కౌంటర్.. ఎస్టీఎఫ్ టీంపై సీఎం ప్రశంసలు.. అత్యవసర సమావేశం..
Yogi Adityanath: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతీక్ అహ్మద్ కొడుకు అసద్ ను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం(ఎస్టీఎఫ్) ఈ రోజు ఎన్కౌంటర్ లో లేపేశారు. ఉమేష్ పాల్ హత్య కేసులో కీలక నిందితులు అయిన అసద్ తో పాటు అతని అనుచరుడు గులాంలు ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ పారిపోతున్న సందర్భంలో ఝాన్సీ వద్ద ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. -
Heat Wave Warning: భానుడి భగభగ.. వచ్చే ఐదు రోజుల్లో 3-5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుదల
Heat Wave Warning: ఏప్రిల్ రెండో వారమే దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్న సమయాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే భారత వాతావరణ శాఖ(IMD) వచ్చే పది రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని ఇప్పటికే హెచ్చరించింది. ఇదిలా ఉంటే వచ్చే ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. -
Kolkata Metro: దేశంలో తొలిసారిగా “అండర్ రివర్ మెట్రో రైల్” పరుగు.. వీడియో చూడండి..
Kolkata Metro Runs Under River, First In India: కోల్కతా మెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో తొలిసారిగా నదీ గర్భం నుంచి మెట్రో రైల్ పరుగులు తీసింది. హుగ్లీ నది నుంచి ఏర్పాటు చేసిన సొరంగం గుండా మెట్రో రైల్ పరుగులు పెట్టింది. ఈ విషయాన్ని బుధవారం సీనియర్ అధికారి వెల్లడించారు. అధికారులు, ఇంజనీర్లతో కూడిన మెట్రో రైల్ హుగ్లీ నది కింద నుంచి కోల్కతా నుండి నదికి అవతలి వైపున హౌరా వరకు నడిచింది. -
China: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. అమ్మపై కంప్లైంట్ చేయడానికి 130 కిలోమీటర్లు ప్రయాణం..
11-yr-old Chinese boy cycled 130 kms for almost 24 hrs: సాధారణం అమ్మ కొడితేనో, నాన్న తిడితేనో ఇళ్లు వదిలిపెట్టి వెళ్లడం చూస్తుంటాం. కొందరు కావాలని కొద్ది సేపటి వరకు తల్లిదండ్రులకు కనిపించకుండా దాక్కుంటారు. ఇలాంటి ఘటనలను మనం నిత్య జీవితంలో చూస్తునే ఉంటాం. ఇదిలా ఉంటే చైనాకు చెందిన ఓ 11 ఏళ్ల బాలుడు మాత్రం తన తల్లిపై కంప్లైంట్ చేయడాని ఏకంగా 130 కిలోమీటర్ల దూరంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.… -
Karnataka Elections: బీజేపీ మాస్టర్ ప్లాన్.. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు చెక్ పెట్టేలా స్కెచ్..
Karnataka Elections: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేవిధంగా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న 189 మంది అభ్యర్థులతో తొలివిడత జాబితాను విడుదల చేసింది. దీంతో 52 మంది కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలు, బలమైన అభ్యర్థులను చూసి పోటీలో నిలిపినట్లు తెలుస్తోంది. -
Wealth of CMs: 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే.. టాప్లో జగన్ మోహన్ రెడ్డి
Wealth of CMs: భారత రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉంటాయనేది కాదనకూడని నిజం. సాధారణంగా గ్రామస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఒక్కసారి అధికారం వస్తే కోట్లకు పడగతెత్తుతున్నారు. అలాంటిది సీఎం అయితే కోట్ల ఆస్తులు ఉండటం చాలా సహజం. అయితే భారతదేశంలో మొత్తం 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే అని అంటే 97 శాతం మంది కోటీశ్వరులే అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. -
Karnataka Elections: “నా కులం చూసే టికెట్ ఇవ్వలేదు”.. బీజేపీపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే..
Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ టికెట్ల వివాదం రచ్చరచ్చ అవుతోంది. మంగళవారం రోజు 189 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అయితే వీటిలో 52 మంది పాతవారిని కాదని కొత్త వారికి చోటు కల్పించింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు. ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కి టికెట్ నిరాకరించింది. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడం హాట్ టాపిక్ గా మారింది.
తాజావార్తలు
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
-
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
-
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో