Madhya Pradesh: రేప్ కేసులో అన్యాయంగా శిక్షించారు.. రూ.10 వేల కోట్లు చెల్లించాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Acquitted In Rape Case Seeks ₹ 10,000 Crore Damage For 2-Year Jail: అత్యాచారం కేసులో తనను అన్యాయంగా రెండేళ్లు శిక్షించారని ఏకంగా ప్రభుత్వంపైనే కేసు పెట్టాడు ఓ వ్యక్తి. నిర్దోషిని అయిన తనను రెండేళ్ల పాటు శిక్షించాలని ప్రభుత్వం తనకు రూ. 10,006.02 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోరాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లామ్ కు చెందిన ఓ వ్యక్తి సామూహిక అత్యాచారం ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే రెండేళ్ల పాటు శిక్ష అనుభవించాడు. తన కుటుంబానికి బాధ కలిగించినందుకు, ఆకలితో అలమటించేలా చేసినందుకు, తనకు బాధ, మానసిక ఆవేదన కలుగచేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరాడు.
Read Also: Errabelli Dayakar Rao : దేవాదుల పనులు వేసవి కాలంలోపు పూర్తి కావాలి
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
కాంతు అలియాస్ కాంతిలాల్ భీల్(35)పై నమోదు అయిన ఆరోపణలను స్థానిక కోర్టు ఉపసంహరించుకుంది. అయితే తనను అన్యాయంగా శిక్షించారని ఆరోపిస్తూ ఆయన సెషన్స్ కోర్టును ఆశ్రయించినట్లు అతని న్యాయవాది విజయ్ సింగ్ యాదవ్ తెలిపారు. ఈ కేసులు జనవరి 10న విచారణకు రానుంది. ఈకేసు గురించి కాంతిలాల్ భీల్ మాట్లాడుతూ.. మానవ జీవితం ఎంతో విలువైనదని దాన్ని కోల్పోయినందుకు రూ. 10,000 కోట్లు,రూ.6.02 కోట్లు న్యాయపరమైన ఖర్చులకు, రూ.2 లక్షలు మానసిక వేధనకు పరిహారం కోరుతున్నట్లు వెల్లడించారు.
ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే.. తప్పుడు సామూహిక అత్యాచారం ఆరోపణల కింది కాంతిలాల్ భీల్ పై 2018 జూలై 20న ఓ మహిళ కేసు పెట్టింది. తన అన్న ఇంటి వద్ద దింపుతానని చెబుతూ కాంతులాల్ భీల్ తనపై అత్యాచారం చేశాడని.. ఆ తరువాత వేరే వ్యక్తికి అప్పగించాడని..అతను ఆరు నెలల పాటు తనపై అత్యాచారం చేశాడని ఆరోపపణలు చేసింది. డిసెంబర్ 23, 2020న సామూహిక అత్యాచారం కేసులో భీల్ ను పోలీసులు అరెస్ట్ చేసి రెండేళ్ల పాటు జైలులో ఉంచారు. తన కుటుంబానికి తానే ఆధారం అని అరెస్ట్ సమయంలో భీల్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. వృద్ధురాలు అయిన తల్లి, భార్య, ముగ్గురు పిల్లలకు తానే ఆధారం అని తెలిపాడు. తాజాగా ఈ కేసు ఉపసంహరించుకోవడంతో భీల్ కు ఉపశమనం లభించింది.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!