Forest Official Stops Commuters To Let Tigers Cross Road In Maharashtra: పులులు రోడ్డు దాటేందుకు అటవీ అధికారి రోడ్డుపై ప్రయాణికుల వాహనాలను ఆపేశారు. ఈ ఘటన మహరాష్ట్ర తాడోబా టైగర్ రిజర్వ్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పటి వరకు 1300 వ్యూస్ దక్కించుకుంది. 11 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను మిలింద్ అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Read Also: Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ..
పులులు ప్రశాంతంగా రోడ్డు దాటేందుకు అటవీ అధికారి ఇరువైపు వాహనాలను ఆపేశారు. ప్రయాణికులను ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఓ పెద్ద పులి చెట్ల వెనకనుంచి రోడ్డును క్రాస్ చేయడం కనిపిస్తుంది. దాని వెనకాలే మరో పులిపిల్ల అనుసరిస్తుంటుంది. ప్రయాణికులు ప్రశాంతంగా, మౌనంగా ఉండాలని అధికారులు కోరడం ఇందులో కనిపిస్తుంది.
మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లా పరిధిలో తాడోబా-అంధేరి టైగర్ రిజర్వ్ ఉంది. తరుచుగా ఈ ప్రాంతంలో పులులు ప్రమాదాలకు గురువుతున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని రోజుల వ్యవధిలోనే ఆరు పులులు చనిపోయాయి. వన్యప్రాణుల వేట, రోడ్డు ప్రమాదాలకు గురై పులులు చనిపోతున్నాయి. ఇదిలా ఉంటే పులుల దాడుల వల్ల ఈ ప్రాంతంలో మనుషులు మృత్యువాత పడుతున్నారు. పులులు-మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యులన్(ఎన్జీటీ) 2019లో మహారాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.
Everyday, tigers and other wildlife are endangered while crossing roads around Tadoba. When will NGT orders be implemented fully by @MahaForest @mahapwdofficial
On the +ve side, kudos to the crowd management here, maybe by @MahaForest staff like last year? pic.twitter.com/p7jCPoTZrP— Milind Pariwakam 🇮🇳🐅🐕🦺🦮🏊🚴🏃 (@MilindPariwakam) January 4, 2023