Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Hadis Killing Sparks Anti India Unrest Ahead Of Bangladesh Polls Who Gains

Bangladesh: బంగ్లాదేశ్‌లో హింస, భారత వ్యతిరేక అల్లర్లతో ఎవరికి లాభం..?

Published Date :December 19, 2025 , 7:13 pm
By Venu Goapl Reddy
  • బంగ్లాదేశ్‌లో మరోసారి హింస..
  • భారత వ్యతిరేక అల్లర్లు..
  • రాడికల్ ఇస్లామిస్ట్ హత్యతో ఉద్రిక్తంగా బంగ్లా..
  • ఈ అల్లర్లతో లాభపడేది ఎవరు.?
Bangladesh: బంగ్లాదేశ్‌లో హింస, భారత వ్యతిరేక అల్లర్లతో ఎవరికి లాభం..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి అగ్నిగుండంగా మారింది. రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య బంగ్లాలో హింసకు కారణమైంది. షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి నేతల్లో హాది కీలకంగా వ్యవహరించాడు. ఇతడిని గుర్తుతెలియని వ్యక్తులు దగ్గర నుంచి కాల్చారు. తీవ్రగాయాలైన హాది మరణించడంతో ఒక్కసారిగా రాడికల్ ఇస్లామిక్ శక్తులు వీధుల్లోకి వచ్చి హింసకు కారణమయ్యారు. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న ఈ తరుణంలో మరోసారి అక్కడ హింసను చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత, అక్కడ మతోన్మాద మూక హిందువుల్ని టార్గెట్ చేసింది. మరోసారి, అక్కడ ఇస్లామిక్ శక్తులు హిందువులపై దాడులకు తెగబడుతున్నారు.

ఈ హింసతో ఎవరికి లాభం:

Also Read

  • Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్‌పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
Add as a preferred
source on google

ఈ హింసతో మరోసారి రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఢాకాతో పాటు పలు నగరాలు, పట్టణాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఆ దేశంలో భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత పెరగడంతో పాటు, మతోన్మాదం పెరిగింది. ముఖ్యంగా, జమాతే ఇస్లామి, అన్సరుల్లా బంగ్లా వంటి సంస్థలు మతాన్ని ఆయుధంగా మార్చుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు తమ శక్తిని పెంచుకోవడానికి జమాతే ఇస్లామీతో పాటు ఇతర ఇస్లామిక్ పార్టీలు ఈ హింసను ఉపయోగించుకుంటున్నాయి. ఈ జమాతే ఇస్లామీనే 1971లో పాకిస్తాన్‌తో కలిసి, బంగ్లా ప్రజల ఊచకోత, అత్యాచారాలకు కారణమైంది. ఈ ఏడాది మహ్మద్ యూనస్‌తో కలిసి అమెరికా వెళ్లిన ఈ సంస్థ నాయకుడు ముహమ్మద్ తాహెర్ న్యూయార్క్‌లో ప్రసంగిస్తూ.. 5 మిలియన్ల మంది భారత్‌కు వ్యతిరేకంగా జిహాద్‌కు సిద్ధంగా ఉన్నారని బెదిరించాడు.

బీఎన్పీని అణిచే ప్రయత్నం, ఎన్నికల వాయిదాకు కుట్ర:

షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత, బంగ్లాలో బీఎన్పీ(బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) అధికారంలోకి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, తామే అధికారంలోకి వచ్చేలా జమాతే ఇస్లామీ ఈ హింసను, భారత వ్యతిరేక కథనాలను ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. ఇప్పటికే యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనాకు చెందిన ‘‘అవామీ లీగ్’’ పార్టీని నిషేధించింది. ఒక వేళ పరిస్థితి చేయిదాటితే, ఎన్నికల్ని వాయిదా వేయాలని మహ్మద్ యూనస్ కూడా భావిస్తున్నారు. ఇదే జరిగితే యూనస్ ప్రభుత్వంపై మరింత పట్టు సంపాదించవచ్చని జమాతే ఇస్లామి భావిస్తోంది.

హాది మరణం తర్వాత ఆందోళలు:

నిజానికి హాది మరణానికి ఎవరు కారణమమో ఇంత వరకు అక్కడి అధికారులు వెల్లడించలేదు. అయితే, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం మాత్రం దీనిని భారత్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తోంది. నిజానికి హాది మరణం తర్వాత అల్లర్లు కనిపిస్తున్నా, చాలా కాలంగా బంగ్లా నివురుగప్పిన నిప్పులా ఉంది. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ లో జరిగిన తిరుగుబాటు దర్యాప్తుపై ఎంక్వైరీ కమిషన్ నివేదిక విడులైంది. తిరుగుబాటుకు అవామీ లీగ్ ప్రభుత్వాన్ని నిందించింది. భారతీయుల ప్రమేయం ఉందని ఇది ఆరోపించింది. దీంతో ప్రస్తుత భారత వ్యతిరేక కథనాన్ని మరింత రెచ్చగొట్టింది.

ఉస్మాన్ హాది మరణం తర్వాత ఇది ఉన్మాదంగా మారింది. యూనస్, జమాతే-ఇ-ఇస్లామీలోని అతని మద్దతుదారులు హదీ హత్యను ఉపయోగించి అవామీ లీగ్ (మరియు భారతదేశం) మరియు బిఎన్‌పి నాయకుడు మీర్జా అబ్బాస్ రెండింటిపై ఒకేసారి దాడి చేయవచ్చు. ఇప్పుడు ఇస్లామిక్ రాడికల్స్ చేస్తున్నది ఇదే. అవామీ లీగ్‌తో పాటు బీఎన్పీపై దాడులు చేస్తున్నారు. బంగ్లాను ఇస్లామిస్ట్‌లు స్వాధీనం చేసుకునే అవకాశ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే భారత్ పక్కలో మరో పాకిస్తాన్‌గా బంగ్లా మారడం ఖాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anti-India protests
  • Bangladesh
  • Bangladesh elections 2026
  • bangladesh unrest
  • Bangladesh violence

తాజావార్తలు

  • BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్‌క్వాలిఫికేషన్!

  • AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!

  • Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా

  • IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions