Jana Sena Party: జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. మార్చి 14న జరగాల్సిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం రద్దు చేసింది. ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన జనసేన నాయకత్వం.. అదే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. రేపటితో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గడువు ముగియనుండగా.. గడువును మరికొంత కాలం పొడిగించే ఆలోచనలో కూడా పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 8 లక్షల […]
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక శాఖలు తీసుకోవడమే కాదు.. వాటిపై ప్రత్యేక మార్క్ కనిపించేలా పని చేస్తున్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో పోస్టు చేసి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన ప్రధాన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం: – రూ.3,200 కోట్లు […]
Off The Record: ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడో సరికొత్త చర్చ హాట్ హాట్గా నడుస్తోంది. ఇక సోషల్ మీడియా విశ్లేషణలు, అంచనాలకైతే హద్దే లేదు. సంబంధం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు… కాస్తంత పొలిటికల్ ఇంట్రస్ట్ ఉన్న ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు సంధించుకుంటున్న ప్రశ్న ఒక్కటే. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారటగా అంటూ పరస్పరం క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెడుతున్నారు. అదేంటి… ఆయన రెగ్యులర్గా ఢిల్లీ వెళ్తుంటారుగా అన్న రొటీన్ సెటైర్స్కు తావు లేదిక్కడ. […]
Off The Record: ఏపీలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒకరు మంత్రి కూడా. అంతా కలిసి అసెంబ్లీ సమావేశాలకు ముందు చాలా మాట్లాడుకున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలతో పాటు ఇతర అంశాల మీద కూడా గట్టిగా రియాక్ట్ అవుదామని డిసైడ్ అయ్యారు. మనం కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి…. మిత్రపక్షాన్ని నొప్పించకుండానే… మన ఉనికి చాటుకుందామని నిర్ణయం తీసుకున్నారట. ప్రధానంగా… రాష్ట్రంలో మనం ఎవరికీ తోకలం కాదు, మనది ప్రజాపక్షం అని బయటికి […]
Vijay Reacts to Divorce Controversy: సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూ ముసురుకున్న వివాదాలపై ఎట్టకేలకు స్పందించారు. ఆ సమస్యల కారణంగా అభిమానులు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే తనకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు టీవీకే విజయ్.. “ఇటీవల ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందుల గురించి మీరు ఆలోచించాల్సిన పనిలేదు.. వాటిపై మీరు పోరాటం చేసి వాళ్లను బాధించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవన్నీ నేను చూసుకుంటాను.. మీరు చేయాల్సిందల్లా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే” అని […]
Off The Record: కూటమి అధికార భాగస్వామి జనసేనలో ఉన్నప్పటికీ ఎలాంటి పదవి లేకుండా, రాజకీయంగా కూడా వెయిటింగ్ మోడ్లోనే ఉన్న ఇద్దరు సీనియర్ నేతల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెద్దగా మార్పేమీ లేకున్నా… ఉన్నట్టుండి వాళ్లు యాక్టివిటీ పెంచడం వెనకున్న రీజన్ ఏంటంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఒకప్పుడు తమ నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను. ఇప్పుడు జనసేనలో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే […]
NBW Against Anantha Lakshmi Durga: తూర్పు గోదావరి జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య అనంత లక్ష్మీ దుర్గపై జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి Uma Sunanda ఈ ఆదేశాలు జారీ చేశారు. కేసుకు సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అనంత లక్ష్మీ దుర్గపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అనంత లక్ష్మీ […]
దేశంలో ఇంధన కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై Hindustan Petroleum Corporation Limited (HPCL) కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందని, పెట్రోల్ బంక్ల వద్ద సరఫరా తగ్గుతుందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. దీనిపై స్పందించిన HPCL అధికారులు ఈ వార్తలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ […]
T20 World Cup 2026 Final: 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఉత్కంఠభరితమైన చివరి దశకు చేరుకుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుంది. ఫైనల్లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకు జరుగుతుంది. అయితే, ఫైనల్ మ్యాచ్కు ముందు అభిమానులను […]
Discount on Gold: ఇరాన్-ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధంతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.. అయితే, ఇది ప్రపంచ బంగారం మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అనేక దేశాల్లో దిగుమతి-ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది.. ఈ పరిస్థితుల ప్రభావం బంగారం వ్యాపారంపై కూడా పడింది. ప్రస్తుతం అనేక బంగారు షిప్మెంట్లు దుబాయ్లో నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. United Arab Emirates వైమానిక ప్రాంతం కొంతకాలం మూసివేయబడటం […]