Buggana Rajendranath Reddy: పెర్ఫామెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్.. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buggana Rajendranath Reddy: ఏపీ బడ్జెట్ 2026-27పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కూటమి ప్రభుత్వ పనితీరు “పెర్ఫామెన్స్ వీక్, పబ్లిసిటీ పీక్” అన్నట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. బడ్జెట్ పుస్తకంలో బొమ్మలు తప్ప అసలు ఆదాయాలు, ఖర్చుల స్పష్టమైన వివరాలు లేవని ఆరోపించారు. ఇప్పటికే రూ.3.12 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, కానీ రాష్ట్ర మొత్తం అప్పులపై స్పష్టత ఇవ్వలేదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం పెద్ద నేరమని, బడ్జెట్లో చెప్పిన అనేక అంశాలు ఊహాగానాలేనని విమర్శించారు.
రూ.90 వేల కోట్లకంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి లేకపోయినా, 60 శాతం పెరిగినట్టు అంచనాలు చూపిస్తున్నారని చెప్పారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు ఎంత నిధులు కేటాయించారో వెల్లడించలేదని ప్రశ్నించారు బుగ్గన.. తమ హయాంలో గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, నాడు-నేడు కింద పాఠశాలలు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, పోర్టులు నిర్మించామని గుర్తుచేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులకు పలు పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
కాగ్ నివేదికల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారలేదని, కేంద్రం కంటే ఆదాయ వృద్ధి ఎక్కువగా ఉందని చెప్పారు బుగ్గన… జల జీవన్ మిషన్ కింద ఖర్చు చేసిన నిధులపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి హామీలకు తగిన కేటాయింపులు లేవని ఆరోపించారు. ఉద్యోగుల బకాయిలు రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ ప్రజాశ్రేయస్సుకు తోడ్పడేలా లేదని, ఇది “అనాలసిస్ ఆఫ్ బడ్జెట్” కంటే “అనాలసిస్ ఆఫ్ అబద్ధాలు”గా మారిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.
బడ్జెట్ అనేది ప్రజాశ్రేయస్సుకు తోడ్పడే విధంగా, పద్ధతిగా అధ్యయనం చేసి రూపొందించాలి. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో అంతటి లోతైన విశ్లేషణ లేకుండా ఊహాజనితమైన లెక్కలతో మాత్రమే ఏర్పాటుచేయబడిందని విమర్శించారు బుగ్గన.. అసలు ఆదాయాలు, అప్పుల వివరాలను బడ్జెట్లో చూపించకపోవడం ప్రజలకు గందరగోళాన్ని సృష్టిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ అప్పులను “మట్కా నంబర్ల” మాదిరిగా చూపిస్తూ అసత్యాలు ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం పెద్ద నేరమని, కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్లో కూడా నిజాలను చెప్పలేదని బుగ్గన హెచ్చరించారు. ఈ పరిస్థితిలో ఆయన “అనాలసిస్ ఆఫ్ బడ్జెట్” కాదు, “అనాలసిస్ ఆఫ్ అబద్ధాలు” చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..
తాజావార్తలు
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?