CM Chandrababu: మారకపోతే వాళ్లకే నష్టం.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఎమ్మెల్యే లు మారకపోతే వారికే నష్టం.. అంటూ మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్లో.. ఎమ్మెల్యేలకు కఠినమైన హెచ్చరికలు ఇచ్చారు చంద్రబాబు.. ఎమ్మెల్యేలు మారకపోతే వారికి నష్టం మాత్రమే వస్తుందని, తన వ్యక్తిగత విధానంలో ఎట్టి పరిస్థితుల్లో నిక్కచ్చిగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. 9 ప్యారామీటర్లలో సర్వే చేయించి, ఫలితాలను సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక, లోకేష్ తన పని తాను చేస్తున్నారు, నేను నా పని చేస్తున్నా. నేతలతో సంబంధాలు, మోటివేషన్ భయ-భక్తీ లాగా ఉండాలి. మంగళగిరి చీరలకు మహిళా ఎమ్మెల్యేలు ఒకే రకమైన చీరలు ధరించడం ఐక్యతకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
అమరావతి అభివృద్ధిపై చర్చలో, బిల్ గేట్స్ను మూడు సార్లు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు చంద్రబాబు.. హైటెక్ సిటీ, విశాఖ అగ్రిటెక్ ప్రాజెక్ట్, సంజీవిని పథకం కోసం బిల్ గేట్స్ తరలింపులు నిర్వహించబడినట్లు వివరించారు. ఇక, జూబ్లీహిల్స్లోని వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్న ఆయన… 1982లో అక్కడ అడవిలా ఉన్న భూమిలో ఇల్లు నిర్మించడానికి వెళ్లిన అనుభవం, తర్వాత బాలకృష్ణకు ఇల్లు కట్టించి ఇచ్చిన విధానం, నాలుగేళ్లలో పరిసర ప్రాంతాల పరిస్థితులు మారిన ఉదాహరణ ద్వారా అమరావతి అభివృద్ధిలోనూ ఇలాంటి గణనీయ మార్పులు సాధించబడతాయని తెలిపారు.
మరోవైపు.. రాయలసీమ అభివృద్ధి గురించి చెబుతూ.. హార్టీకల్చర్ హబ్కు 30,000 కోట్లు కేటాయించడం ఎమ్మెల్యేలకు సంతోషకరం అన్నారు చంద్రబాబు… పూర్వం నీరు, పశు ఫీడ్ రాయలసీమకు అందకపోవడం, రైన్ గన్స్ ఉపయోగించడం వంటి సమస్యలు పరిష్కరించబడ్డాయని, ఇప్పుడు దేశంలో ఉత్తమ పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని, దానిమ్మకు బాగా డిమాండ్ ఉందని వివరించారు. మొత్తం మీద, చంద్రబాబు ఎమ్మెల్యేలకు నిక్కచ్చిత్వం, భయభక్తి మరియు సమర్ధతతో పని చేయాలనే సందేశాన్ని స్పష్టంగా ఇచ్చారు, అలాగే అమరావతి, రాయలసీమ అభివృద్ధి విజయాలను ప్రజలకు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!