CM Chandrababu: మారకపోతే వాళ్లకే నష్టం.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఎమ్మెల్యే లు మారకపోతే వారికే నష్టం.. అంటూ మరోసారి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్లో.. ఎమ్మెల్యేలకు కఠినమైన హెచ్చరికలు ఇచ్చారు చంద్రబాబు.. ఎమ్మెల్యేలు మారకపోతే వారికి నష్టం మాత్రమే వస్తుందని, తన వ్యక్తిగత విధానంలో ఎట్టి పరిస్థితుల్లో నిక్కచ్చిగా ఉంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. 9 ప్యారామీటర్లలో సర్వే చేయించి, ఫలితాలను సీల్డ్ కవర్లో ఎమ్మెల్యేలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇక, లోకేష్ తన పని తాను చేస్తున్నారు, నేను నా పని చేస్తున్నా. నేతలతో సంబంధాలు, మోటివేషన్ భయ-భక్తీ లాగా ఉండాలి. మంగళగిరి చీరలకు మహిళా ఎమ్మెల్యేలు ఒకే రకమైన చీరలు ధరించడం ఐక్యతకు ఉదాహరణ అని పేర్కొన్నారు.
Also Read
- AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
- Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
- YS.Jagan: మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా? చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్
అమరావతి అభివృద్ధిపై చర్చలో, బిల్ గేట్స్ను మూడు సార్లు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘనత తనదేనని పేర్కొన్నారు చంద్రబాబు.. హైటెక్ సిటీ, విశాఖ అగ్రిటెక్ ప్రాజెక్ట్, సంజీవిని పథకం కోసం బిల్ గేట్స్ తరలింపులు నిర్వహించబడినట్లు వివరించారు. ఇక, జూబ్లీహిల్స్లోని వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్న ఆయన… 1982లో అక్కడ అడవిలా ఉన్న భూమిలో ఇల్లు నిర్మించడానికి వెళ్లిన అనుభవం, తర్వాత బాలకృష్ణకు ఇల్లు కట్టించి ఇచ్చిన విధానం, నాలుగేళ్లలో పరిసర ప్రాంతాల పరిస్థితులు మారిన ఉదాహరణ ద్వారా అమరావతి అభివృద్ధిలోనూ ఇలాంటి గణనీయ మార్పులు సాధించబడతాయని తెలిపారు.
మరోవైపు.. రాయలసీమ అభివృద్ధి గురించి చెబుతూ.. హార్టీకల్చర్ హబ్కు 30,000 కోట్లు కేటాయించడం ఎమ్మెల్యేలకు సంతోషకరం అన్నారు చంద్రబాబు… పూర్వం నీరు, పశు ఫీడ్ రాయలసీమకు అందకపోవడం, రైన్ గన్స్ ఉపయోగించడం వంటి సమస్యలు పరిష్కరించబడ్డాయని, ఇప్పుడు దేశంలో ఉత్తమ పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని, దానిమ్మకు బాగా డిమాండ్ ఉందని వివరించారు. మొత్తం మీద, చంద్రబాబు ఎమ్మెల్యేలకు నిక్కచ్చిత్వం, భయభక్తి మరియు సమర్ధతతో పని చేయాలనే సందేశాన్ని స్పష్టంగా ఇచ్చారు, అలాగే అమరావతి, రాయలసీమ అభివృద్ధి విజయాలను ప్రజలకు వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?