Middle East War Impact: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు వ్యాపార రంగానికీ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల ఒకప్పుడు విలాసవంతమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచిన లగ్జరీ కార్ల మార్కెట్ కుదేలవుతోంది. కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్, ఫెరారీ వంటి కార్లు షోరూమ్లలోనే నిలిచిపోతూ దుమ్ము పట్టే పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రాచ్యం ఎప్పటికీ లగ్జరీ కార్ల తయారీదారులకు అత్యంత లాభదాయకమైన […]
New Labour Codes 2026 India: దేశంలో ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు నాంది పలికే కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రావడంతో ఉద్యోగుల జీతభత్యాలు, పని విధానాలు, సామాజిక భద్రత వంటి అనేక అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా, పీఎఫ్ పెరగడం వల్ల చేతికి అందే జీతం తగ్గే అవకాశం ఉందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం […]
Off The Record: తూర్పు గోదావరి జిల్లాలో జనసేనకు కీలకమైన నియోజకవర్గాల్లో నిడదవోలు ఒకటి. కానీ…ఇక్కడే పార్టీ వీక్ అవుతోందన్న ఆందోళన ప్రస్తుతం ద్వితీయ శ్రేణిలో పెరుగుతోంది. స్వయంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ప్రాతినిధ్యం వహిస్తున్నా…. సెగ్మెంట్లో పార్టీ కార్యకలాపాలు నెమ్మదిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. లోకల్గా సభ్యత్వ నమోదే ఇందుకు ఉదాహరణ అంటూ చూపిస్తున్నారు నాయకులు. అత్యంత కీలకమైన చోట కేవలం 19 వేల సభ్యత్వాలు మాత్రమే అయ్యాయట ఇక్కడ. అలా ఎందుకంటే… కారణాలు చేలానే […]
Common Health Issues in Men: పురుషులు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు రకరకాల పనుల్లో.. బిజీగా ఉంటారు.. వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నా లైట్గా తీసుకుంటారు.. పురుషుల ఆరోగ్యం అంటే చాలా మంది జిమ్ వ్యాయామాలు, బలం, ప్రోటీన్ డైట్లు వంటి విషయాలతోనే పరిమితం చేస్తారు. కానీ, నిజమైన ఆరోగ్యం అనేది మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను గుర్తించడం, వాటిని నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంలో ఉంది. చాలాసార్లు పురుషులు […]
ACB court: లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB)కి చిక్కిన అనంతపురం జిల్లా పెనుగొండ అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ నాగభూషణం పై కర్నూలు ఏసీబీ కోర్టు కఠిన చర్యలకు పూనుకుంది.. కోర్టు ఆయనకు ఏడేళ్ల కఠిన జైలు శిక్ష విధించడంతో పాటు 2 లక్షల రూపాయాలు జరిమానా విధించింది. కోర్టు తీర్పులో రూ.2 లక్షల జరిమానాలో రూ.1,90,000ను బాధితుడు, అతని భార్యకు పరిహారంగా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. Read Also: PBKS vs GT: టాస్ గెలిచిన […]
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు, గ్రామస్థాయి కార్యకర్తలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం వంటి పలు అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 29న ఘనంగా నిర్వహించామని, పార్టీకి సేవలందించిన సీనియర్ కార్యకర్తలను సత్కరించామని తెలిపారు. రాజకీయ సాధికారతను పెంపొందిస్తూ, జనాభా దామాషా ప్రకారం అన్ని […]
AP Panchayat Raj Wins National Awards 2026: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు.. ఈ విజయాలు గ్రామీణాభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించిన పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి […]
Tirupati Girl De*ath Case Twist: తిరుపతిలో 13 బాలిక రీల్స్ చేస్తూ మృతి చెందిన కేసులో సంచలన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మొదట అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఘటనలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. సోమవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన బాలిక పుష్ప కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మొదట రీల్స్ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని తల్లి పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. అయితే, విచారణలో భాగంగా కుటుంబ సభ్యులను ప్రశ్నించిన […]
Running Time by Age: ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది బయటకు ఫిట్గా కనిపించినా, లోపల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం అంత సులభం కాదు. నిజానికి, ఫిట్నెస్ అంటే కేవలం జిమ్లో బరువులు ఎత్తడం కాదు.. మీ గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం, శరీర ఓపిక అన్నీ కలిసి పనిచేసే స్థితి. ఈ నేపథ్యంలో, మీరు నిరంతరాయంగా ఎంతసేపు పరుగెత్తగలుగుతున్నారనే విషయం మీ ఫిట్నెస్కు ముఖ్యమైన సూచికగా భావించవచ్చు. పరుగు ఒక అద్భుతమైన కార్డియో […]
CM Chandrababu: మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ గ్రామసభలు, హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సంజీవని ప్రాజెక్టుపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం, నారావారిపల్లెలో సమర్ధవంతంగా అమలవుతోన్న ప్రాజెక్టును జూలై కల్లా […]