Telangana Panchayat Elections: తెలంగాణలో పల్లెపోరు మొదలైంది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. మొదటి విడతలో 4 వేల 236 గ్రామాల పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక, ఆయా గ్రామ పంచాయితీల్లో ఎన్నికల సందడి మొదలైంది.. మొదటి రోజు 4,236 సర్పంచ్ స్థానాలకు 3,242 సర్పంచ్ నామినేషన్లు దాఖలు కాగా.. వార్డు మెంబర్ల కోసం తక్కువస్థాయిలో అంంటే.. 37,440 వార్డు మెంబర్ స్థానాలకు 1,821 నామినేషన్లు మాత్రమే […]
Off The Record: హై వోల్టేజ్ పాలిటిక్స్కి కేరాఫ్గా ఉండే భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన మార్క్ కనిపిస్తోందా అంటే… అనుమానపు చూపులే అందరి సమాధానం. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకే ప్రస్తుతం డౌట్స్ ఎక్కువగా ఉన్నాయట. పైగా… తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టు మావాళ్ళు అపరిపక్వంగా వ్యవహరించి పరువు తీశారని పార్టీ సీనియర్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితి. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయాక […]
తెలుగులో తిట్టినా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదు..! తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రదాన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ […]
Off The Record: అదిగో కేస్ అన్నారు… ఇదిగో అరెస్ట్ అని ప్రచారం చేశారు. ఇంకేముంది, అంతా అయిపోయింది. ఆడుదాం ఆంధ్రాలో బీభత్సాలు జరిగిపోయాయి. కోట్లు కొల్లగొట్టేశారు. ఆ కేసులో మాజీ మంత్రి రోజాను అరెస్ట్ చేసేస్తున్నారంటూ ఒక దశలో తెగ హడావిడి చేశారు టీడీపీ లీడర్స్. కట్ చేస్తే…. ముఖచిత్రం వేరుగా ఉంది. ఇప్పుడసలు ఆ ఊసేలేదు. అక్రమాలు, అరెస్ట్లంటూ… అప్పట్లో నానా హంగామా చేసిన నాయకుల గొంతులన్నీ మూగబోయాయి. పైగా… అదే టైంలో ఆరోపణలు […]
Digital Arrest in Kadapa: కడప జిల్లా పోలీసులు మరో డిజిటల్ అరెస్టు కేసును ఛేదించారు. ఈ రెండో కేసు కూడా పులివెందుల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో చేయించడం, అందులోనూ మరో ఉపాధ్యాయుడు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. సిబిఐ అధికారులతో కేటుగాళ్ల బెదిరింపులకు తాళలేక మానసిక వేదనతో సదరు ఉపాధ్యాయుడు చనిపోవడం మరింత విషాదాన్ని కలిగిస్తోంది. మృతి చెందిన ఉపాధ్యాయుని కుమారుడు ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులను […]
Spiritual Township in Tirupati: తిరుపతి నగరంలో 600 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3,000 కోట్ల వ్యయంతో మెగా ఆధ్యాత్మిక టౌన్షిప్ నిర్మించేందుకు డెల్లా గ్రూప్ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్కు రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.. తిరుపతిలో త్వరలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ వివరాలను మంత్రి అనగానికి డెల్లా గ్రూప్ ప్రతినిధులు వివరణాత్మకంగా వివరించారు. ఈ టౌన్షిప్లో 5 వేల ఏళ్ల హిందూ మత సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక […]
Off The Record: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ ఇన్చార్జ్లు పార్టీలో కట్టప్పల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారట. తమతోనే ఉంటూ… వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి మారిన వాళ్ళకు కూడా టచ్లో ఉన్న వాళ్లని కట్టడి చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి మైలవరం, జగ్గయ్యపేట, పెనమలూరు నియోజకవర్గాల్లో ఈ ఆపరేషన్ నడుస్తోందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభాను, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, […]
Amaravati Farmers: రాజధాని అమరావతి ప్రాంత రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం ముగిసింది.. ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతులతో సమావేశం అవుతానని చెప్పారు చంద్రబాబు.. త్రిసభ్య కమిటీ ప్రతినెల రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ఇక, రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా విన్న చంద్రబాబు… రైతుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.. Read Also: Venkaiah Naidu: తెలుగులో తిట్టినా […]
Venkaiah Naidu: తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రదాన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. వెంకయ్య నాయుడు […]
Telangana Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనరేట్లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ లీగల్ సెల్ ముగ్గురు సూపరిండెంట్ స్థాయి అధికారులతో పర్యవేక్షించబడుతుంది. గతంలో ఎన్నికల రిజర్వేషన్లపై పలు కోర్టు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడం, ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవడం కోసం ఈ […]