వినాయక చవితి వచ్చేసింది.. ఇప్పటికే గల్లీలు, విధులు, ఊరు, వాడ అనే తేడా లేకుండా గణేష్ మండపాలు వెలుస్తున్నాయి.. మరికొన్ని చోట్ల.. మండపాల ఏర్పాటుకు, విగ్రహాలు పెట్టేందుకు అధికారులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ అనుమతుల కోసం తిరాగాల్సిన పరిస్థితి ఉంది.. ఈ పరిణామాలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త సీరియస్గా స్పందించారు.. నీ విగ్రహాల ఏర్పాటుకు నిరాకరించే వారికి నిద్ర లేకుండా చేయిస్వామి అంటూ ఆ గణపతిని వేడుకున్నాడు.. ఏ విషయంపైనానా ముక్కుసూటిగా, […]
శ్రీ సత్య సాయి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత సభ్యసమాజం సిగ్గుపడేలా చేశాడు.. బుక్కపట్నం మండలం కృష్ణాపురంలో పదహారేళ్ల బాలికలను పెళ్లి చేసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షడు.. ఆయన వయస్సు 62 ఏళ్లు.. బాలికకు దయ్యం పట్టిందని ముందుగా నమ్మించిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత క్షుద్ర పూజలు నిర్వహించాడు.. ఆ తర్వాత తన వల్లే నయమైందని బాధితురాలి తల్లిదండ్రులను నమ్మించి.. తన అసలు రంగును బయటపెట్టాడు.. ఆ […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రతిష్టాత్మక “ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్”లో స్థానం లభించింది. పర్యావరణ హితాన్ని కోరుతూ లక్షా 24 వేల మట్టి విగ్రహాలను తయారు చేయించడంతో పాటు ప్రజలకు ఉచితంగా ఇంటింటికి అందించడంలో విశేష కృషి చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ అవార్డుకు అర్హత సాధించారు. తిరుపతి రూరల్ పరిధిలోని చిగురువాడ అకార్డ్ స్కూల్ అవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. […]
ఈ నెలలో ఏకంగా 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.. కొన్ని రాష్ట్ర-నిర్దిష్ట బ్యాంకు సెలవులతో పాటు మరికొన్ని ఉన్నాయి. సెప్టెంబర్ 2022లో, వారాంతాలతో సహా 13 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=UiM_h5L6F7s
ఆసియా కప్లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. అసలు సిసలైన మ్యాచ్కి సమయం ఆసన్నమైనది.. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్… యుఏఈ వేదికగా తలపడనున్నాయి… దాయాది జట్ల మధ్య రసవత్తర పోరు జరిగితే ఆ మ్యాచ్.. ఓ చిన్న యుద్ధంలాగే ఉంటుంది. ఎప్పుడూ క్రికెట్ చూడనివారు కూడా.. ఈ మ్యాచ్ చూసి తీరుతుంటారు.. అభిమానుల కోలాహోలం మధ్య ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే రాజకీయ కారణాల వల్ల ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగనప్పటికీ.. ఐసీసీ టోర్నీ, […]
తెలంగాణలో ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించబోమని రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు అధికారులు. పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. ఉదయం పది గంటల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తామని తెలిపారు అధికారులు. పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, వాచీలు, క్యాలిక్యులేటర్ లాంటి ఎలక్ట్రానిక్ […]
* నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు * ఆసియాకప్లో నేడు పాకిస్థాన్తో తలపడనున్న భారత్, దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * నేడు హైదరాబాద్లో 11వ ఎడిషన్ మారథాన్.. నెక్లెస్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు మారథాన్, హైదరాబాద్ రన్నర్స్, ఎన్ఎండీసీ, ఐడీఎఫ్సీ ఆధ్వర్యంలో నిర్వహణ, మారథాన్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు, 42 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఫుల్ మారథాన్ * నేడు తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష, ఉదయం […]
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా సార్లు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.. ఇవాళ హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.. విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న నడ్డాకు.. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్.. సహా మరికొందరు నేతలు స్వాగతం పలికారు.. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ […]