Kunamneni Sambasiva Rao: 30 నియోజకవర్గాలపై ఫోకస్.. అసెంబ్లీలో అడుగు పెట్టాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీలో సీపీఐ ప్రవేశం ఉండాలి… ఆ లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.. సీపీఐ శ్రేణులు పునరుత్తేజంతో పని చేయాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే టీఆర్ఎస్ తో కలిశాం.. సమస్యలు ఎక్కడ ఉంటే సీపీఐ అక్కడ ఉంటుంది.. రాష్ట్రంలో అనేక వర్గాలు సమస్యలతో సతమతమవుతున్నాయి.. అధికార పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఉద్యమాలు, పోరాటాల్లో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.. ఇటీవల జరిగిన ఘటనలో పురుష దూరహంకారం కనిపిస్తోంది.. మహిళలపైనే ఎందుకు వ్యభిచారం కేసులు పెడుతున్నారు.. ఇద్దరు కలిస్తేనే తప్పు జరిగినట్లు.. ఆడవారికి శిరోముండనం చేసిన వారిని ప్రశ్నించాలన్నారు సాంబశివరావు.
Read Also: Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్త పథకం ద్వారా 9.75 లక్షల ఉద్యోగాలు..!
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఇక, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కూనంనేని… బీజేపీ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పే వరకు ప్రతీ గ్రామంలో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. మరోవైపు.. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని సీపీఐ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందన్న ఆయన.. ఒకవేళ గవర్నర్ వ్యవస్థ ఉంటే మంత్రివర్గ నిర్ణయాలను తప్పకుండా అమలు చేయాల్సిందే అన్నారు.. ఇప్పుడు కొన్ని రాష్టాల్లో గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఉచితాలు, సబ్సిడీ ఎత్తివేయాలని కుహనా మేధావులు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, మిలిటెంట్ పోరాటాలకు అందరూ సిద్ధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. అసెంబ్లీలో సీపీఐ ప్రవేశం ఉండాలి… ఆ లక్ష్యంగా పని చేయాలని.. రాష్ట్రంలో సీపీఐ బలంగా ఉన్న సుమారు 30 నియోజకవర్గాలపై దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!