Karishma Tanna: బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా తన్నా అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. 42 ఏళ్ల వయసులో ఆమె తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె త్వరలో తన తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో, ఆమె పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. Read Also: IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..! కరిష్మా తన భర్త వరుణ్ బంగేరాతో కలిసి […]
Sanju Samson: టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు విజయాలు అందించిన సంజు శాంసన్, ఐపీఎల్ 2026లో మాత్రం పూర్తిగా భిన్నమైన ఫామ్లో కనిపిస్తున్నాడు. వరుసగా మూడు ఇన్నింగ్స్లలో 6, 7, 9 పరుగులతో నిరాశపరిచిన శాంసన్పై ఇప్పుడు ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదే సమయంలో అతనిపై భారీగా పెట్టుబడి పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచకప్లో ఒత్తిడి పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఆడిన శాంసన్, ‘బిగ్ మ్యాచ్ ప్లేయర్’గా పేరు […]
FBI Warns Smartphone Users: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా విదేశీ కంపెనీలు తయారు చేసిన కొన్ని మొబైల్ యాప్ల వల్ల వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ యాప్లు వినియోగదారుల సున్నితమైన సమాచారం.. లొకేషన్, కాంటాక్ట్స్, వ్యక్తిగత […]
Story Board: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. సిటీలో ఉన్నా, పల్లెలో ఉన్నా.. ఎక్కడున్నా సరే.. ఇంట్లో వంట గ్యాస్ అయిపోయిందని బుక్ చేద్దామని చూస్తే.. అమాంతం పెరిగిన ధర చూసి షాక్ అవుతున్నాం. కేవలం గ్యాస్ మాత్రమే కాదు.. మార్కెట్కు వెళ్లి కూరగాయలు, నిత్యావసరాలు కొందామన్నా రేట్లు మండిపోతున్నాయి. దీనికంతటికీ కారణం ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం. ఎందుకిలా.. వాళ్లు యుద్ధం చేసుకుంటే మన జేబులకెందుకు చిల్లు పడుతోంది? అనే డౌట్ మనకు రావచ్చు. […]
Crocodile Captured in Konaseema: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ఆరు నెలలుగా రైతులను భయాందోళనకు గురిచేసిన మొసలి ఎట్టకేలకు పట్టుబడింది. పి. గన్నవరం సమీపంలోని అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక సమాచారం ప్రకారం, వరదల సమయంలో ఆరు నెలల క్రితం ఈ మొసలి ఈ ప్రాంతంలోకి చేరింది. అప్పటి నుంచి నీటి మడుగులు, చెరువుల వద్ద సంచరిస్తూ రైతులు, జాలర్లలో భయాన్ని కలిగించింది. పొలం పనులు చేయడానికి […]
LPG Shortage: ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్లో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఈ నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ సరఫరాను స్థిరంగా ఉంచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశంలో ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కిలోగ్రాముల చిన్న సిలిండర్ల […]
Rice Flour Roti Recipe: బియ్యపు పిండితో చేసే రోటీలు రుచికరంగా ఉండటమే కాకుండా, ముఖ్యంగా వేసవిలో ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. తేలికగా జీర్ణమయ్యే గుణం ఉండటంతో ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. రోజూ గోధుమ రోటీలకు బదులుగా కొంత మార్పు కోసం బియ్యపు పిండితో రోటీలు తయారు చేసుకుని తినడం మంచి ఎంపికగా భావించబడుతోంది. ఈ రోటీలు సాయంత్రపు అల్పాహారంగా లేదా తేలికపాటి రాత్రి భోజనంగా తీసుకోవచ్చు. పచ్చి చట్నీ, పప్పు, కూరగాయలు లేదా […]
Vizag Crime: క్రికెట్ విషయంలో తలెత్తిన ఓ వివాదం యువకుడి దారుణ హత్యకు దారి తీసిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది.. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి హతమార్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు పెదగదిలి కొండవాలుకు చెందిన డిగ్రీ విద్యార్థి డోల అజిత్ (23)గా గుర్తించారు. సమాచారం ప్రకారం, క్రికెట్ ఆట విషయంలో అజిత్ మరియు కిషోర్ అనే వ్యక్తి మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. గతవారం పోలమాంబ […]
CM Chandrababu Anantapur Visit: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది. * ఉదయం 09:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం బయలుదేరుతారు. అనంతరం ఉదయం 11:10 గంటలకు అనంతపురం జిల్లా యాడికి […]
Tirumala Hundi Issue: రూ.1,000 నోట్లతో పాటు.. పాత రూ.500 నోట్లను రద్దు చేసింది ప్రభుత్వం.. ఆ తర్వాత రూ.2 వేల నోట్లు, కొత్త రూ.500 నోట్లతో పాటు.. రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10.. ఇలా కొత్త కరెన్సీ తీసుకొచ్చింది.. అయితే తిరుమలలోని శ్రీవారికి మాత్రం పాత ఓట్ల పంచాయతీ తప్పడంలేదు.. శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలు కోట్లలో ఉంటాయి. అయితే, ఇటీవలి కాలంలో హుండీలో పడుతున్న చెల్లని కరెన్సీ నోట్ల సమస్య తిరుమల […]